పుట:దశకుమారచరిత్రము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

దశకుమారచరిత్రము

వ. అనుచు విచారించి.59
క. పెనుమూఁకలలో సందడి
     జనకుఁడు తొడిఁ బడియెనేని సంరంభం బె
     ల్లను నిష్ఫల మై భస్మం
     బున వేల్చిన యాహుతియును బోలెం గాదే!60
క. మనకుం దెఱఁ గెయ్యదియో
     యని పలికెడుసమయమున మహాసర్పము గ్ర
     క్కున నొక్కబొక్క వెలువడి
     చనుదెంచెసు రోఁజుచున్ విషజ్వాలలతోన్.61
తే. మంత్రతంత్రబలమును గ్రమక్రమమున
     దానివీర్యంబు మర్దించి తత్క్షణమునఁ
     బట్టికొని యప్పు డొక్కయుపాయమాత్ర
     నెఱిఁగి యాపూర్ణచంద్రుతో నిట్టు లంటి.62
సీ. మనకు దైవం బిప్పు డనుకూలముగఁ దెచ్చె
                    జింతితార్థంబులు సిద్ధిఁ బొందె
     జనకుఁ గన్నులు పుచ్చ నని వధ్యశిలకుఁ దె
                    చ్చినయప్పు డొకభంగిఁ జేరి యతని
     నీపాము గఱపించి యే వెజ్జ నై చొచ్చి
                    వెడచంపు చంపినన్ బుడమిఱేని
     యనుమతంబునఁ బతియనుమరణమునకుఁ
                    గాంతిమతీదేవి గడఁగి యంత్య
తే. మండనార్థంబుగాఁ దనమగని నిజగృ
     హంబునకుఁ గొనిపోవంగ నంత నీవు