పుట:దశకుమారచరిత్రము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

225

     జనితాంతర్గతభీతిమై విడిచి రుత్సాహంబు కౌటిల్యమున్.52
వ. అంత నొక్కనాఁడు.53
క. నేరక వల్లభుఁడు సవతి
     పేరం దనుఁ బిలుచుటయును బిట్టలిగి మదిన్
     సైరణ సేయం జాలక
     తారావళి వోయెఁ దల్లితండ్రులకడకున్.54
ఉ. ఆకమలాక్షి యి ట్లలిగి యక్షపురంబునకు న్నిజంబుగాఁ
     బోక యెఱింగి మంత్రులును భూపతియుం దమలోనఁ గూడి శో
     కాకులచిత్తుఁ డై నగరి కల్లన వచ్చిన కామపాలునిం
     జేకుఱఁ బట్టి సంకలియః జెచ్చెరఁ బెట్టి దయవిహీనతన్.55
తే. అతనికన్నులు పుచ్చువా రైరి గాన
     యేను నప్పుడె ప్రాణ మీఁ బూని యచట
     నాయితం బయి పగతుర నం పొనర్చి
     తాఁకఁ జూచెద నాభుజదర్ప మొప్ప.56
ఉ. నావుడు నిట్టు లంటి మసనంబున నేడ్చెడునన్నుఁ జూచి తా
     రావళిఁ బ్రీతిఁ గైకొని ధరాధిపుపంపున రాజహంసధా
     త్రీవరుదేవి నావసుమతీసతిఁ జేర్చిన బాలకుండ నే
     భూవినుతుండఁ గాంతిమతిపుత్రుఁడ నిక్కువ మర్థపాలుఁడన్.57
ఉ. కావున నీకు నిక్కఁ బని గాదు విషాదము దక్కి చూడు నా
     లావును బీరమున్ వెలయ లంకకు వానరవీరుఁ డేఁగున
     ట్లీవసుధాధినాయకుని యింటికి నేఁగెద గాని చేసెదన్
     దీవస మొప్పఁగా జనకుఁ దెచ్చెద వేగమ యెల్లభంగులన్.58