పుట:దశకుమారచరిత్రము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

దశకుమారచరిత్రము

క. కలఁ గని మేల్కని మును మదిఁ
     గల సందియ మెల్ల విడువఁగా నప్పుడు కో
     ర్కులు చిక్కువఱచె మరుఁ డ
     మ్ములవానలు చూపెఁ దాపమున కిర వైతిన్.96
ఆ. సరసిజాప్తుఁ డుదయశైల మెక్కినయది
     యాది గాఁగఁ గ్రుంకునంతదాఁక
     నరసి తెలిసి కంటి నంగనకడ కేఁగు
     తెఱఁగు తెల్ల మదికిఁ దేటపడఁగ.97
వ. ఇ ట్లుపాయంబు గాంచి నేఁడు మాధవీమండపంబున కతం
     డెల్ల భంగులం జనుదెంచు నని కల్పసుందరికి వా రెఱింగిం
     చునట్లుగాఁ బనిచి యుపకరణంబులు సమకట్టి పురంబులోని
     సందడి డిందుపడుటయు.98
క. నీలాంబరంబు పట్టిన
     వాలును బెరయంగఁ జీకువాలునఁ గాంతా
     కేలీకుతూహలంబునఁ
     గ్రాలెడు చిత్తంబు తోడుగాఁ బ్రీతి మెయిన్.99
క. నరపతివప్రముఖసరి
     త్పరిసరమున నోలమైన పట్టున నాపు
     ష్కరికకు నేకత మొకయో
     వరి గలుగుట నందుఁ జని యవారణ నచ్చోన్.100
తే. డాఁచియుంచిన వంశదండంబు దెచ్చి
     నేలపై వైచి వప్రము నిలువఁ జేర్చి
     కోటయును దాటి పోయి నిష్కుటముఁ జొచ్చిఁ
     దాది చెప్పిన తెరువుచందంబుఁ దలఁచి.101