పుట:దశకుమారచరిత్రము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

199

     బున వెలుఁగొందె లోకములు పొంపిరివోవఁగ నింపుసొంపునన్.91
క. ఏనును జేయు తెఱం గెద
     లో నాలోకించి ధర్మలోభము ధర్మ
     గ్లానికర మయ్యె నని య
     బ్జాననఁ బొందుటకు సంశయము మొల తేరన్.92
మ. పరదారాభినివేశబుద్ధి దలఁపం బాపంబు ధర్మార్థముల్
     దొరకొల్పంగ నుపాయమైన నది నిర్దోషంబు నాఁ దొల్లి బం
     ధురశాస్త్రజ్ఞుల చేత నిందు గురుబంధుక్లేశమోక్షార్థికిన్
     దురితం బయ్యెడు నెట్లు? చిత్తమున కాందోలాయితం బేటికిన్?93
వ. అనుచు శయ్యాతలంబునకుం జేరి నిద్రవోవునప్పుడు.94
సీ. ఏ నొకనాఁడు గంగానదిలోపల
                    నవగాహనము చేసి యాడుచున్న
     నురలి కలంగి నిల్పోపక కోపించి
                    జాహ్నవి నా కొక్కశాప మిచ్చె
     మనుజుఁడ నగు మని; మగుడ శపించితిఁ
                    గాంతవై మర్త్యలోకమునఁ బుట్టి
     పలువుర భాజనంబవు గమ్ము నీ వని
                    యది యాదిగా నిప్పు డవనిమీఁద
తే. నమర నరి కల్పసుందరి యై జనించె
     నేను నీ వై జనించితి నెగ్గు లేదు
     సందియంబులు దిగఁ ద్రావి సుందరాంగిఁ
     గలయు మని చెప్పెఁ గలలోన గజముఖుండు.95