పుట:దశకుమారచరిత్రము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

201

సీ. జలజాకరము తూర్పు సహకారవీథికి
                    నుత్తరం బై పోవ నొక్కకేళి
     పర్వతం బున్న డాపలఁ బెట్టి చని యశో
                    కావలి దఱియంగ నరిగియరిగి
     మలఁగినదెసఁ బడమరమొగంబై కొంత
                    ద వ్వేఁగి పున్నాగతరువు గాంచి
     యచటికి బది తప్పుటడుగులు దక్షిణం
                    బున సగుణోజ్జ్వలవనము క్రేవ
తే. మూసి డించిన సందున మొక్కలంబు
     తోఁపఁ దోతెంచుదీప్తులతోడి దివియ
     గారవంబునఁ గనుఁగొని చేరఁబోయి
     మాధవీమండపం బని మది నెఱింగి.102
క. తలిరు లను చేపపట్టెల
     నలవడఁ బొందించు జైత్రుఁ డనునోజఁ జనం
     దలుపైన చూతవిటపము
     దొలఁగంగ ముసుంగు లెల్లఁ ద్రోచి ముదమునన్.103
వ. ఆవ్యవహారగృహాభ్యంతరంబు ప్రవేశించి.104
శా. తాంబూలాంబరగంధమాల్యసహితాంతర్వేదిపైఁ బుష్పత
     ల్పం బామీనపతాకు నంపపొదిలీలం బోలినం జూచి డా
     యం బో నల్కుచు లేమ వచ్చుతెరు వే నాలించుచున్నంత హృ
     ద్యం బై వీఁకదనంబుతోన పదశబ్దంబల్లఁ బుట్టించినన్.105
చ. అరయుదు దీనిచంద మని యచ్చటు వాసి యశోకభూరుహాం
     తరితుఁడ నైతిఁ గాంతయు లతాగృహ మల్లన సొచ్చి చూచి చె
     చ్చెర నను నందుఁ గానమికిఁ జేట్పడి మన్మథవేదనార్త యై