పుట:దశకుమారచరిత్రము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

దశకుమారచరిత్రము

క. తన కసదృశుఁ డగు పురుషుడు
     దను మెచ్చక యొరులవలనఁ దగిలినవానిం
     గనుఁగొనిన మానవతి యగు
     వనితకుఁ జిత్తంబు నూఱు పఱియలు గాదే?73
క. కావున మగఁ డని పలుకఁగ
     నేవం బగు వికటవర్మ యేటి మగఁడు నీ
     వావసుధాధిపనందను
     వేవే తో డ్తెమ్ము మాధవీగృహమునకున్.74
వ. అనిన విని యమ్మగువ తెఱం గెఱింగి యఱ సేయక యి
     ట్లంటి.75
చ. పలుకులు వేయు నేల నరపాలతనూజుఁడు నాకు మిత్రుఁ డి
     మ్ములఁ గొనివచ్చి కూర్చెదఁ బ్రమోదముఁ బొందుము తక్కు మింక ను
     మ్మలికము వాఁడునుం గుసుమమార్గణపీడితమానసుండు వి
     చ్చలవిడి నీకు నాతనికి సంగతి చేకుఱు నమ్ము మెమ్మెయిన్.76
వ. అని పలికి వసంతకేళినాఁడు నరపతిసమేతంబుగా సఖీజనం
     బులు దానునుం బురవీథి నరుగుచుండ నొక్కజాలకంబున
     నీవు దన్నుం జూచితనియును నది మొదలుగాఁ గదిరిన మద
     తాపంబునం దలరియున్నవాఁడననియునుం జెప్పి నన్నుం
     బొందు గొని యిత్తెఱం గెఱింగించి తనరూపంబు చిత్రించి
     దీనిం గొనిపోయి కల్పసుందరికిం జూపి యచ్చెలువ చిత్తం
     బుకొలంది యరసి రమ్మని నియోగించె ననియునుం జెప్పిన.77