పుట:దశకుమారచరిత్రము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

173

తే. తమక మడరిన యప్పుడ తలిరుఁబోఁడిఁ
     గవయఁ జూచియు ధృతి యూఁడి కార్య మరసి
     నిద్ర దెలుపుట యుడిగి నా నెమ్మనమునఁ
     గొందలముతోడి తలఁపులు సందడింప.148
వ. ఇట్లని యూహించితి.149
ఉ. చూడ్కులఁ జిత్తవృత్తి గని చొచ్చి నయంబుగ మాటిమాటికిన్
     వేడ్కలు బెంచి యింపులగు విన్ననువుల్ దగఁ జేసిచేసి యా
     మాడ్కి సరోజలోచనల మచ్చికమై నెలయించి యిక్కకుం
     దోడ్కొని పోయి కాక మరుతోడి యలంతలు తీర్పవచ్చునే.150
మ. నడురే యిప్పుడు నిద్ర దెల్పుటయుఁ గన్యారత్న ముద్వేగముం
     దొడర న్వింతతనంబునం బరిజనస్తోమంబు మేల్కాంచి సం
     దడి సేయం దగ దిప్పుడీయబలఁ జెంతం జేరఁగావచ్చు టే
     ర్పడఁగా నొక్కతెఱంగు చేసి చనినన్ రంజింపవచ్చుం దుదిన్.151
వ. ఏమియుపాయంబులనైనఁ బిదపఁ గార్యసిద్ధికిం దగినభంగి
     చూచికొందు నని కందర్పు కారించుట కోర్చి శయ్యసమీ
     పంబున నున్న పలకయుం జిత్రోపకరణంబులుం బుచ్చుకొని
     నిద్రానిమీలితయైన యంబాలికారూపంబు చిత్రించి తత్ప
     దానతంబుగా మదీయరూపంబును వ్రాసి యచ్చేరువ
     నొక్క పద్యంబు లిఖించితి నది యెట్టి దనిన.152
తే. తరుణి! తగుబంట నీపదాంబురుహములకు
     మ్రొక్కి యే విన్నవించితి నొక్కమాట