షష్ఠాశ్వాసము
151
జనంబులు విచ్చలవిడి నమ్మదిరాక్షి యెదురం బొలయ మా
టాడ నెత్తరువునం జేరంగ నోడుదురు [1]మనతెఱం గెట్లో
యని శంకించెద ననిన విని యిట్లంటి.44
తే. చేయుకార్య మెయ్యది యను చింత యేల
చెలువ నాదెసఁ దగులుట చెప్పి తీవ
యిట్లు దలఁపులు దలకూరు నెగ్గులాడు
తల్లి నొకభంగి వంచించి యెల్ల రెఱుఁగ.45
వ. అది యెట్లం టేని.46
క. ఆనందంబున మాధవ
నేనకు మనతోలుతిత్తి చేర్చెద నని సం
ధానము పుచ్చి తదాత్మజ
నే నడిగెదఁ గపటవిద్య లెన్నటి కింకన్.47
వ. అని నిశ్చయించి వారియింటికడ నుచితసమయంబుల నెడ
యాడి పొడసూపి యెఱింగించుకొని యజ్జఱభిపాలికిం జని.48
తే. తగిలి ధనమిత్రు నజినరత్నంబు మీకు
నేన మ్రుచ్చిలి యిచ్చెదఁ బూని మీరు
రాగమంజరిఁ జిత్తానురాగ మెసఁగ
నాకు నిండని పుచ్చితి నయము మెఱసి.49
వ. అదియును నప్పలుకులకు మోసపోయి చర్మభస్త్రికవలనం
ధనదానంబులు సేయువిధం బడిగి పుత్తెంచినలోకం బెఱుంగ
నుదారకుండు విన్నవించిన తెరం గెఱుంగుదుర కదా
తమజాతికిం గోమట్లకు నిదిపసిండి యొసంగుట నిశ్చయంబు
దీనిం గైకొని రహస్యంబుగాఁ గల్పవిధానంబు నడపునది
- ↑ అ ట్లగుటఁ