పుట:దశకుమారచరిత్రము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

125

     గన నెమ్మది కనురాగము
     పొనరింపఁగఁ జాలు నతఁడ పురుషుం డెందున్.46
వ. కావున.47
తే. లక్ష్మికూరిమిసుతు రాజ్యలక్ష్మివోని
     కామమంజరి యను వారకాంత గలదు
     దానిచేత మీయర్థసౌందర్యతార
     తమ్య మేర్పడు మీరలు దాని కిపుడు.48
వ. రో యిచ్చి పుచ్చుం డిదియ సర్వజనసమ్మతంబైన కార్యం
     బిట్లు సేయనినాఁడు మీయన్యోన్యవివాదంబులకు నిర్ణ
     యింప నశక్యం బని యొక్కశుభగపతాక గల్పించి కుంటె
     నీలుగా నిరువుల సమకట్టి.49
క. మీరలు వీ రిద్దఱికై
     యారాజీవాక్షియింటి కరిగి ప్రియముమైఁ
     జేరి చతురు లై రో యీఁ
     గోరుట యెఱిఁగించుటయునుఁ గోమలి ప్రీతిన్.50
ఉ. ఎవ్వనిదూతఁ గైకొనియె నెవ్వనియున్నెడ కేగుదెంచెఁ దా
     నెవ్వానిఁ బ్రీతిఁ గైకొనియె నెవ్వనితోఁ బలికెం బ్రియంబుమై
     నెవ్వనిచెట్టఁ బట్టెఁ దగ నెవ్వని నింటికిఁ బిల్చె వాఁడు నేఁ
     డివ్విజయధ్వజంబునకు నీశుఁ డగున్ సుభగత్వ మేర్పడన్.51
వ. అని పలికినం గపటమతు లైన విటజనంబుల మాటలకుం
     దగులువడి మచ్చరంబున నజ్జోటికూటంబు వాటింపం
     దలంచి యేము గుంటెనీయులం బుచ్చిన నచ్చెలువయు.52