124
దశకుమారచరిత్రము
తే. ఎగ్గు గాదేని యెఱిఁగింపు మిష్ట మేని
నిన్ను నడిగెద నొకమాట నిష్ఠ నిట్లు
తపసివేషంబు గైకొని తగవుగాని
శోకమున నేల పొగిలెదు నాకుఁ జెపుమ!42
వ. అనిన నతం డి ట్లనియె నే నీచంపానగరంబున సంపన్నుం
డైన నిధిపాలుం డను వైశ్యు నగ్రనందనుండ వసుపాలితుం
డును విరూపకుండును నను నామద్వయంబులకు ననురూ
పంబు లైన ధనరూపంబులు గలుగువాఁడ నిందొక్కరుండు
సుందరక నామధేయుండు సుందరాకారంబు గలిగి హీన
ధనుం డగువాఁడు గలండు నాకును వానికి ధనరూపంబుల
నీసువైరంబు గావింపం దలంచి వైరోపజీవులయిన సౌరధూ
ర్తులు వేశ్యావిషయంబు లైన యాలాపంబులు ప్రసంగించి.43
క. ధనమునకు రూప మధికము
ధన మధికము రూపమునకు ధనమును రూపం
బును సరి యని పలుకుచు దు
ర్జనభావము వెలయ వాదు సమకట్టి రొగిన్.44
ఉ. సుందరకుండు నేనును నసూయతనంబున వారిత్రిప్పులం
గ్రందొనరించి యొండొరులఁ గష్టపుఁదిట్టులు దిట్టుచున్నచో
నందఱు గూడి యొక్కసమయంబు క్రమంబున నిశ్చయించి మా
మంచట మాన్చి యి ట్లనిరి మానుగఁ దా రనుకూలశత్రు లై.45
క. ధనవంతుడు రూపసియును
మనమునఁ దలపోయ నధికమాన్యులు ప్రౌఢాం