122
దశకుమారచరిత్రము
రాకకుం గారణం బేమి యని యక్కోమలి నడిగిన న
క్కొలువులో నొక్కలేమ లేచి యిట్లనియె.33
క. వనమున కరిగి మరీచిని
మనసిజమదమత్తుఁ జేసి మనవీటికిఁ దె
చ్చినవనితకు వరువుడ నని
జననాథా! పన్నిదంబు సఱచినదానన్.34
సీ. నాతోడఁ బురుడించు నాతు లందఱు వినఁ
బ్రతినలు గొని వనాభ్యంతరమున
కరిగి మేడ్పఱచి కామాతురుఁ జేసి యి
మ్మునినాథు నిట దెచ్చె ముదముతోడఁ
గావున నేఁ డాదిగాఁ గామమంజరి
వరుసతోఁ బనిచినవరవుఁబనులు
దప్పక చేయుచు దాసినై యుండెద
ననవుడు జననాథుఁ డపహసించె
తే. నాతు లందఱు మునిఁ జూచి నవ్వఁదొడఁగి
రతఁడు లజ్జించి క్రమ్మఱి యరుగుదెంచె
నిట్టి పాలసుఁ జూడంగ నేల నీకు
నెఱుఁగఁ జెప్పెద విను మాతఁ డేన సుమ్ము.35
వ. ఈదృశుండైన నావలన సాధించు మనోరథంబునుం గలదె
యైనను.36
క. కలఁగినచిత్తము దృఢముగ
నిలిపి విచారించి యేను నీచెలికాఁ డి
మ్ముల నున్న చంద మేర్పడఁ
దెలిపెద నేతెమ్ము కొన్నిదివసంబులకున్.37