104
దశకుమారచరిత్రము
వ. అయ్యవసరంబున.80
తే.విభుఁడు దేవియు నవ్వార్త విని తలంకి
యతిరయంబునఁ జను దెంచి యల్లుఁ జూచి
యతనిఁ జంపిన దారును నాక్షణంబ
చత్తు మని కాచి కాత్మల సంతసిల్లి.81
సీ. కాచిన వారలఁ గడచి చంపుట పతి
హితము గా దని తనమదిఁ దలంచి
యారాజనందను దారుపంజరమున
నునిచి పుష్పోద్భవు ధనము లెల్లఁ
గొని వాని నలిపెట్టి కొఱగాము లెన్నియొ
నెన్ని పత్రికల వ్రాయించి దర్ప
సారుపాలికి నొక్క జంఘాలుఁ బంచి వాఁ
డీసింహశర్మమహీశుకూఁతుఁ
తే. దనకు నడుగుటయును సముదగ్రవృత్తిఁ
ద్రోపు సేసిన విక్రమాటోప మొప్ప
నతని సాధింప సమకట్టి యాగ్రహంబు
మిక్కుటముగఁ జంపాపురిమీఁద నడిచె.82
వ. ఇట్లు నడుచుచుండి యొరుల నమ్మక దారుపంజరగతుం డై
కిశోరకేసరి ననుకరించు రాజవాహనకుమారుఁ దోడన కొని
పోయి కతిపయప్రయాణంబుల నంగపురము డాయం జని
చుట్టుముట్టి విడిసి యనుదినంబు కయ్యంబు సేయుచునుండె
సింహవర్మయు సుహృన్మహీపతుల కెఱింగించి పంచిన వారు
చంపాపురంబునకు సన్నాహంబు మెఱసి వచ్చుటం దడవు
లేకున్నను దాలిమిమాలి కోట తలుపులు తెఱపించి.83