పుట:దశకుమారచరిత్రము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

"క. తగునే నీవు పతివ్రత ..........................
     ...........................యఁగ ఛీ నీచేతు లెట్టు.” (దశమా. ప. 97)

లోఁ గేతనమహాకవిమతమునకు వ్యతి రేకముగ అర్ధబిందుకనిర్బిందుకప్రాసము సమకూర్పఁబడినది. మఱియు సప్తమాశ్వాసాంతపద్యములలో

"భారతామ్నాయసేవాదరణ."

అని వ్రాయఁబడినది. కేతన తిక్కనసోమయాజి గ్రంథరచనము భారతరచనమును చెప్పనే లేదు. అట్టిచో భారతప్రశంస కవిమతమునకు విరుద్ధము.

నందిగామ.శేషాద్రి రమణకవులు
20-4-1925శతావధానులు

N. B. చీకటి, ఏగు, పరగ, లోనగుశబ్దములలో నర్ధబిందువు ప్రాచీనగ్రంథానుసారముగ లేదు. ఇందే చీకటి నిర్బిందుకముగ 161, 284. పుటలలో బ్రాసమందుఁగలదు. కావున నరసున్న ప్రమాదపతితము (పా) యని గుర్తు పెట్టఁబడినవి పాఠాంతరములు.