ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12
"క. తగునే నీవు పతివ్రత ..........................
...........................యఁగ ఛీ నీచేతు లెట్టు.” (దశమా. ప. 97)
లోఁ గేతనమహాకవిమతమునకు వ్యతి రేకముగ అర్ధబిందుకనిర్బిందుకప్రాసము సమకూర్పఁబడినది. మఱియు సప్తమాశ్వాసాంతపద్యములలో
- "భారతామ్నాయసేవాదరణ."
అని వ్రాయఁబడినది. కేతన తిక్కనసోమయాజి గ్రంథరచనము భారతరచనమును చెప్పనే లేదు. అట్టిచో భారతప్రశంస కవిమతమునకు విరుద్ధము.
- నందిగామ.శేషాద్రి రమణకవులు
- 20-4-1925శతావధానులు
N. B. చీకటి, ఏగు, పరగ, లోనగుశబ్దములలో నర్ధబిందువు ప్రాచీనగ్రంథానుసారముగ లేదు. ఇందే చీకటి నిర్బిందుకముగ 161, 284. పుటలలో బ్రాసమందుఁగలదు. కావున నరసున్న ప్రమాదపతితము (పా) యని గుర్తు పెట్టఁబడినవి పాఠాంతరములు.