పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 తెలుగు భాషా చరిత్ర

సంకీర్ణ౦

5.65. కర్తృషష్టి క్రియావిశేషణాలకు కర్త నేటి వ్యావహారికభాషలో ప్రథమావిభక్తిలోనే ఉంటుంది. కాని ప్రాచీనకాలంలో షష్టీవిభక్తి విపుల ప్రచారంలో ఉండేది. ఉదా. రాముని చేసినపని మొ.వి. గతయుగం శాసనాల్లో ఇట్టి కర్తృషష్టి చాలా విరివిగా ప్రయోగంలో కనిపించింది. కాని ఈయుగంలో ఇట్టివి చాలా అరుదు. [త]మ శే [శి]న సుకృతాలు (SII 5.10 13,1404) మొ.వి. చాలా స్వల్పంగా కనిపిస్తాయి. ఇలాంటిచోట్ల ప్రథమవాడడం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. జన్యావుల కసవానాఇనింగారు చేయించిన వరుపుంబని (పై.10.580.8. 1414), మొ.వి.

5.66. ఏవార్థంలో తెలుగుభాషలో-ఆ ప్రత్యయం మాత్రమే 12వ శతాబ్దిదాకా ప్రచారంలో ఉండేది. 12వ శతాబ్ధినుండి “ఎ” లేక “ఏ” ప్రారంభమై 1వ శతాబ్దిలోగా ఇవిబాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ యుగంలో-అ ప్రత్యయం దాదాపు వ్యవహారంలో లేదనవచ్చు. ఎ ఏలు పూర్తి వ్యవహారంల్లోకి వచ్చినట్లు చెప్పవచ్చు. తమ మాతాపితాళ్లనుతానే వధించిన దోషానపోవువారు (SII 6.219.25, 1494), సూరనంగారే కట్టించినారు (పై. 5.36.25, 1422).మొ.వి.

సముచ్చయార్థంలో ఈ యగంలో అకారాంత శబ్దాలకు దీర్ఘం, దానితర్వాత -ను ప్రత్యయమూ, ఇకారాంత౦ తర్వాత న్ని ప్రత్యయమూ, ఉకారాంతం తర్వాత -న్ను ప్రత్యయమూ బాగా ప్రచారంలోకి వచ్చాయి. కొమ్మనాను... ప్రోలున్ను .. నందిన్ని... (SII 5. 38-67.10,1414) మొ. వి.

ఙ్ఞాపికలు

1. M. Kandappa Chetty. A Study of 11th century Inscriptional Telugu. SUVOJ. Tirupati 1964,pp 33-40.

2. నాహిండు (SII 110.321.9,1248), రాయబోహిడి (పై. 5.54, 8, 1298) మొ. వాటిలో యా > యి > హి కావడం గుర్తింంవచ్చు. (చు§ 5, 16)

3. ఎం. కందప్పశెట్టి, 11 వ శతాబ్ది వర్తమావ క్రియలు భారతి. సెప్టెంబరు 1968.

  • శాననాలు పూర్వయగంలో ఉపయోగించినవన్నీ ఈ యుగంలోనూ ఉపయోగించబడ్డాయి. అవిగాక తిరుమల-తిరుపతి దేవస్థానం శాసనాలు (తి.తి.దే.శా) కూడా ఈ యగానికి పనికి వచ్చినాయి.