ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0352-02 వసంతం స౦: 04-౩04 కృష్ణ
పల్లవి:
తల్లియాపె కృష్ణునికిఁ దండ్రి యీతఁడు
చల్లఁగా లోకములెల్లా సంతోసమందెను
చ. 1:
అరుదై శ్రావణబహుళాష్టమినాటిరాత్రి
తిరువవతారమందెను కృష్ణుఁడు
యిరవై దేవకిదేవి యెత్తేకొని వసుదేవు -
కరములందుఁ బెట్టితే కడుసంతోసించెను
చ. 2:
తక్కక యమునానది దాఁటతఁడు రేపల్లెలో
పక్కన యశోదాదేవిపక్కఁ బెట్టెను
యెక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని
గక్కన వినిపంచితే కడుసంతోసించెను
చ. 3:
మరిగి పెద్దై కృష్ణుఁడు మధురలోఁ గంసుఁజంపి
బెరసి యలమేల్మంగఁ బెండ్లాడి
తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు
ఇరవై తే వసుదేవుఁ డేఁచి సంతోసించెను