ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0071-3 ఆహిరి సం: 05-237
పల్లవి:
ఆపదలె సంపదలకాధారమై తోఁచె
పైపైనె తమకంబె పరిణామమాయ
చ. 1:
పురిగొన్న మదనాగ్ని పుటము దాఁకినవలన
తరుణిదేహంబు కుందణమువలెనాయ
నురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడెఁ గాన
మరుజన్మమై మహమహిమఁ బొగడొందె
చ. 2:
పొలుపైన యిరులచేఁ బూవుగట్టిన వలన
సొలయకే మేను జాజుల పొట్లమాయి
నెలకొన్న గొజ్జంగనీటఁ దడియఁగఁబట్టి
కలకంటిమేను పులు గడగినట్లాయ
చ. 3:
అందుపైఁ దిరువేంకటాద్రీశు నిజకృపా-
నందంబు తనకు బ్రహ్మనందమాయ
పొందైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-
నందమయి సౌభాగ్యమగ్గలంబాయ