ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | నిష్ఠ లవెన్ని గల్గినను, నేర్పు నరణ్యమునందుఁ బొందినన్, | 52 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మనుజుడు అరణ్యంలో నివసిస్తూ, నియమనిష్ఠలు మొదలైన వాటిలో ఎంతో గొప్ప నైపుణ్యాన్ని సాధించినా, అంతమాత్రంచేత ఈ జీవుడు మళ్లీ పుట్టకుండా ఉండజాలడు. (పునర్జన్మను పొందకుండా తప్పించు కోలేడని అభిప్రాయం).
కులమదం, రూపమదం, బలమదం, ధనమదం, యౌవనమదం, విద్యామదం, అధికారమదం, తపోమదం - అనే ఎనిమిదిరీతుల మదములను పూర్తిగా తొలగించుకొని, ఆత్మయొక్క తత్త్వాన్ని దర్శింపగల్గినటువంటివాడు మాత్రమే సువిశాలమైన ఈ సంసారసాగరాన్ని దాటి, (ఆవలితీరమైన) మోక్షాన్ని చేరుకోగలడని సారాంశం.