ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | కంఠములోని నాళ మతికాంతిగ వెల్గెడి రీతిఁ జూచి, యా | 51 |
భావం:
దయాసముద్రుడవయి తరిగొండలో ఆవిర్భవించియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! చిత్తగింపుమా! ఈ దేహమందలి జీవుడు కంఠంలో మిగులకాంతితో వెలుగొందే నాళాన్ని పరికించి, అలాగే ఆ కంఠంమీద నెలకొనివున్న రెండు కాటుకకొండలమధ్యన ప్రకాశిస్తూవున్న పరమేశ్వరుణ్ణి సందర్శించాలి. అలా సందర్శించిన ఆ జీవాత్మ మృత్యువుకు అధిపతియైన యముణ్ణి సైతం వేగంగా ధిక్కరించి, నేరుగా శ్రీవైకుంఠలోకాన్ని చేరగలడు!