ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | మూఁడు గుణంబులు న్నెఱిఁగి, ముందటి మార్గముఁ గాంచి గ్రక్కునన్, | 53 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! వందనములు! జీవుడు సత్త్వము, రజస్సు, తమస్సు- అనే మూడుగుణాలయొక్క స్వరూప, స్వభావాలను తెలిసికొని, ఆ పై అనుసరించదగిన మార్గాన్ని శీఘ్రంగా దర్శించి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరము లనెడి మూడు శరీరాల తత్త్వాలను గుర్తెఱిగి, తొణకని స్థిరచిత్తంతో మిగుల మూలన ఉండే కోనయందు (సహస్రారంలోపల) ప్రవేశించి, ఇడ, పింగళ, సుషుమ్న-- అనే మూడు ప్రవాహాలు సంగమించియున్న- సంతోషాన్ని ప్రసాదించే- స్థలాన్ని చేరుకొంటే మోక్షం లభిస్తుంది.