33
8. హాజీ షరియతుల్లా
(1780-1840)
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విప్లవకారులకు స్పూర్తిని ప్రసాదించిన ఉద్యమాలలో ఫరాజీ తిరుగుబాటు ప్రముఖ స్థానం పొందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు భారత దేశంలో నిలదొక్కుకుంటున్న సమయంలో బ్రిటిషర్ల మీద తిరుగుబాటు ప్రకటించి ప్రజలను, ప్రధానంగా గ్రామీణ రైతాంగాన్ని, చేతి వృత్తులవారిని ఏకం చేసి పోరుబాటన నడిపించిన ఫరాజీ ఉద్యమనేత హాజీ షరీయతుల్లా.
1780లో తూర్పు బెంగాల్లోని ఫరీద్పూర్ జిల్లా, బహదూర్ర్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి అబ్దుల్ జాలిబ్. తండ్రిది చేనేత వృత్తి. షరియతుల్లా 18వ ఏటనే మక్కా వెళ్ళి ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసి పండితుడిగా రాటుదేలారు. అ సందర్భంగా వహాబీ ఉద్యమ నిర్మాత సయ్యద్ అహమ్మద్ బరేల్వీ, మహాయోధుడు టిటూమీర్లను కలుసుకున్నారు. ఆ చర్చల పర్యవసానంగా తనదైన ధార్మిక-లౌకిక మార్గాన్నినిర్దేశించుకుని 1802లో ఫరీద్పూర్ చేరుకున్నారు.
స్వదేశం చేరు కోగానే మక్కాలో నిర్ణయించుకున్నలక్ష్యాల సాధనకు ప్రస్తు త బంగ్లాదేశ్ రాజధాని ఢకా సమీపాన గల నవాబారి గ్రామాన్ని కేంద్రంగా చేసు కుని ధార్మిక బోధనలతో ఆరంభించి క్రమంగా మాతృదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తం చేయడానికి
చిరస్మ రణీయులు