Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనఘా యిప్పుడు నీపుర
మునకు నరిగి నీదుసైన్యములఁ గూడి రయం
బున రమ్మని పంపి సురేం
ద్రనందనుం డపుడు తనపురమ్మున కరిగెన్.

211


వ.

ఇ ట్లర్జునుం డరిగినయనంతరంబ యాచతుర్ధనజననాయకుండు
మనంబున సంతోషంబు నొంది నిజరాజధాని యైనకుండిన
నగరంబున కరుగుదెంచి కతిపయదినంబు లుండి చతురంగ
బలసమేతుండై యమరావతీపురంబునుంబోలిన యింద్ర
ప్రస్థపురంబునకుఁ జనుదెంచి యందు.

212


చ.

అనిలతనూభవుండు దివిజాధిపనందనుఁడుం గవల్ ముదం
బునఁ గొలువన్ మణిప్రకరభూషితసౌధమునందుఁ గామినీ
జనమృదుహస్తసంకలితచామరవీజనజాతవాతపో
తనికరలోలకుంతలుని ధర్మతనూజునిఁ గాంచె వేడుకన్.

213


ఆ.

కని యుపాయనంబుగా మత్తకరులు మ
ణులు మృగేక్షణామణులుఁ దురంగ
రత్నములు సువర్ణరాసులుఁ బ్రేమ స
మర్పణంబు చేయ నతఁడు మెచ్చి.

214


క.

ఆనరనాయకునకు స
న్మానం బొనరించి నవ్యమణిపీఠిక నా
సీనుం జేసి సురేశ్వర
సూనుని దెసఁ జూచి ధర్మజుఁడు గనుసన్నన్.

215


తే.

ఈతఁ డేభూవిభుండు పే రేమి యిటకు
రాఁ బ్రయోజన మే మిది క్రమముతోడఁ
దెలియఁజెప్పుమటన్న నాదేవరాజ
తనయుఁ డిట్లని పల్కె హస్తములు మొగిచి.

216