Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనఘవరేణ్య కుండినపురాధిపుఁ డితఁడు పేరిటన్ జతు
ర్ధనుఁ డసునాతఁ డేను మృగరాజి నణంపఁగ వేఁటఁ బోయియుం
డ నచటి కేగుదెంచి కపటంబునఁ బల్కెను న న్విరోధి యొ
క్కనృపుఁడు చంపఁబూనెఁ దగఁ గావు మటంచు మహార్తితోడుతన్.

217


తే.

శరణుఁ జొచ్చినవారి రక్షణము సేయ
వలయు వీరులకని మదిఁ దలంచి కావఁ
బ్రతినఁ జేసితిఁ దదనంతరంబ శౌరి
వైరి యని చెప్పె నీతండు వసుమతీశ.

218


క.

శ్రీవిభునితోడి నెయ్యము
భూవరుప్రాణంబు గాచు పూనికయును నా
కేవెరవునఁ గూడెడునని
దేవర కెఱిఁగింప నరుగుదెంచితి భీతిన్.

219


తే.

నాప్రతిజ్ఞయు నితనిప్రాణములుఁ గావ
నేది తెరవగు నట్టి దూహించు మనుచుఁ
బాదములమీఁద వ్రాలు నప్పార్థుఁ జేరఁ
దిగిచి యిట్లని పల్కె యుధిష్ఠిరుండు.

220


మ.

సకలోపాయవిశారదుండు నయశాస్త్రప్రౌఢుఁ డాయోధనో
త్సుకుఁ డుద్దండవిరోధిసంహరణదక్షుం డుగ్రశస్త్రాస్త్రజా
లకళావేది గిరీంద్రధీరుఁడు సరోల్లాసాత్మపంకేరుహుం
డకలంకుం డగుకృష్ణు నోర్వ నజదుర్గాధీశులున్ శక్తులే.

221


క.

పోనీ శరణాగతికై
మేనులు హరి కొసఁగి కీర్తి మించి సురేంద్ర
శ్రీ నెగడెద మిది విడిచిన
హీనపుబ్రతు కేల రాజ్య మేటికి మనకున్.

222