Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనుచు గోవింద మంచన శర్మ, నర్మసఖుండగు టిట్టిభుండును
దానును హట్టమార్గంబునం జనునప్పుడు,

76

సుసరభే త్తను వేడుకమందు నమ్ము బోటి

తే.

జిగురుటుండలు నించి, డా చేతియందుఁ
బెద్ద యేనుఁగు దంతంబు పెట్టెఁ బెట్టి,
యింతులకుఁ బ్రీతిగా మైల సంతలోన
‘సుసరభే’త్తని ఘోషించె జోటి యోర్తు.

77


వ.

ఇది యేమి ఘోషించుచున్నయది? కిరాటకులరత్నంబ! నీవు
తేటపడ నెఱింగి, మాకు నెఱింగింపు మనుచు మంచనశర్మ
యడిగిన,

78


చ.

ముసిముసినవ్వుతో నతని మోము గనుంగొని వైశ్యుఁ డి ట్లనున్‌;
రసికకులావతంసుఁడవు బ్రాహ్మణ! యింతకు మున్నెరుంగవే?
యసమశరాలయంబునను హత్తిన వెండ్రుక కప్పు వోవఁగా,
విసరు సమీరణం బయిన వేడుక మం దిది, కొందు రంగనల్‌.

79


సీ.

కమఠావతారంబుఁ గైకొన్న దైత్యారి
                        కమనీయచరమభాగంబు వోలె,
నాదియుగంబునం దావిర్భవించిన
                        జిననాథదేవుని శిరసు వోలెఁ,
గసటు వోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ
                        బెట్టిన తామ్రంపుబిందె వోలెఁ,
గంగమట్టియతోడ సాంగత్య మెడలిన
                        నునుపారు మునిమిట్టనుదురు వోలెఁ,


తే.

జిఱుత ప్రాయంపునాఁటి సజ్జికపుఁ జాయ
తొలు సమర్తయకాలంపు విలసనమునఁ