పుట:కేయూరబాహుచరిత్రము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కేయూరబాహుచరిత్రము

     దానిఁ బొందిన భూపతి ధరణీ సార్వ, భౌముఁ డగు నిది మునివరభాషితంబు.188
వ. అను లేఖ యాకర్ణించి.189
క. ఱిచ్చవడి వెల్లవాఱుచు, ముచ్చముడిఁగి మూర్ఛ తన్ను ముంచికొనంగా
     వచ్చిన ధైర్యం బూఁతఁగ, నచ్చేడియ నిల్చు టప్పు డద్భుత మయ్యెన్.190
వ. అట్లుండి తనలోన.191
క. ఇది యేమి చేసికొంటిని, మదిమదినుండి జను లెల్ల మతిలే దని న
     వ్వెదరు సవతిరాకకునై, మదినోర్చినఁ దలమె వారీమాటల కోర్వన్.192
వ. అని యిట్లు పశ్చాత్తాపపీడితయై యిది విధికృతం బింక దీనికి ధైర్యం బంచమి.
     లని మెచ్చునకు ధైర్యంబు దెచ్చుకొని ధీరయగుట నవికారయై యుండె.193
క. కార్యమూల మెఱుంగక కడగి యొరుల, కఱపు మదినమ్మి తమకు నయ్యెఱుక
     యొరులఁ బఱచెద మనిపోయి యొరులచేతఁ, దారు వడుదురు రత్నసుందరివిధాన.194
వ. భాగురాయణుండు తనయుపాయంబు సఫలం బగుటకుఁ బ్రియం బందె.195
క. పరసుఖమునందుఁ బొందుగ, విరచించుచు మంతనంబు వెలిపుచ్చక నే
     ర్పరి యైన భాగురాయణు, కరణి ననుష్టింపవలయుఁ గార్యము లెల్లన్.196
వ. మృగాంకావళీ కేయూరబాహు లనంతరంబున.197
సీ. కర్పూరకస్తూరికాపరిమళకరండము లంటిరత్నహర్మ్యములయందుఁ
     గోకిలకీరాదికోలాహలంబున విలసిల్లు నుద్యానతలములందు
     మత్తకేకులకెల్ల నృత్తరంగము లైనరమణీయకేళిశైలములయందుఁ
     బరిమళకదళికాప్రాప్తిలతాశ్రేణి నమరుదీర్ఘికలతీరములయందు
గీ. నాఁడునాఁటికి వేడ్కలు నాటుకొనఁగ, సారెసారెకు నింపు లింపారుచుండ
     నంతకంతకు నాచట లగ్గలింప, నంగజక్రీడఁ దేలుదు రభిమతముగ.198
వ. ఇట్లు లబ్ధమనోరథుం డై కేయూరబాహుమహీనాథుండు.199
సీ. తేజంబు గలఁడు సాధించు శత్రుల ప్రజ్ఞ వెండి నిందకుఁ జాల వెఱచుఁగాని
     యరి నొవ్వఁగొనఁడు తప్పరయు ధర్మరతుండు భృత్యులం జెఱపఁడు సత్యవా
     కలక యుబ్బుట భీతి కలుష మేమఱుట మొక్కలము వెఱగుపాటు చలము
     కామినీలోలుండు గాఁడు సేవకుచేఁత మఱవఁ డిచ్చినయీఁగి మగుడఁ గొనఁడు
గీ. క్రౌర్యలోభజాడ్యకపటవ్యసనముల, పొంతఁ బోవఁ డాయమును వ్యయంబు
     నెఱుఁగు నాఁడునాఁటి కింద్రియవర్యుండు, గాక సుజనవినుతికలితుఁ డయ్యె.200