పుట:కేయూరబాహుచరిత్రము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

75

సీ. యేలు భూమియంతయుఁ దననగరిలోపలవోలే నెంతయుఁ దెలివిపడఁగ
     చ్చట మరుదేశ మిచట జాంగలరాష్ట్ర మిచ్చట సమతల మిచటసార
     మ నసారము కొండలిట నేరునిచటఁ బేరడవి యిచ్చటఁ గలదని యెఱింగి
     నాకాలమున కగు నిచట దుర్గం బని తెలిసి దుర్గంబులు బలుపుచేైసి
గీ. కాసి యున్న సమీపభూపతులలోన, సబలు నబలుని మిత్రుని శత్రు నరసి
     గురుపాయంబులను వారిఁ జక్కఁ జేసి, పుడమి పాలించి యెల్లెడఁ బొగడ నెగడె.201
క. స్వామియు మంత్రియు దుర్గ, స్తోమము రాష్ట్రంబు వనము సుహృదులు బలముం
     మహి సప్తాంగము లని, తా మదెలో నెఱిఁగి వీనిఁ దగ రక్షించెన్.202
సీ. స్త్రీలోలవృత్తి మై సింహబలుండును జూదంబుచే ధర్మసుతుఁడు నలుఁడు
     ..కపానాసక్తి యాదవులును వేఁటతగులునఁ బాండుఁడు దశరథుండుఁ
     బొంకు ప్రల్లదమున బౌరవులును బరుసనిదండమున జరాసంధనృపతి
     స్నప్రయోజననిఖిలార్థపరిత్యాగమున నాహరిశ్చంద్రమనుజపతియు
గీ. యాపదలఁ దొల్లిఁ బొందిరి యట్ల యగుట, వ్యసనసప్తక మెప్పు డొప్ప దని యెఱింగి
     వాని వర్జించి ధరయెల్ల వ్రాలి యేలి, సార్వభౌమత్వమందె నజ్జనవిభుండు.203
గీ. బుద్ధి శస్త్రంబు సప్తాంగములును మేను, గార్యయత్నరహస్యరక్షణము జోడు
     కారులేదృష్టులును సూతజనము ముఖము, ధర్మవర్తన ప్రాణ మాధరణిపతికి.204
వ. తద్రాజ్యంబున.205
ఉ. వృత్తులఁ గల్ములం బొదలి విప్రులు పెద్దయు ధన్యులైరి య
     త్యుత్తమధర్మకార్యముల నొంది వసుంధర సర్వదానసం
     పత్తి వహించె ధర్మము లపారతఁ బొందె జనంబు గేహమున్
     దత్తదభీష్టవస్తువులఁ దామరతంపరలయ్యె నయ్యెడన్.206

ఆశ్వాసాంతపద్యములు


     క్షాంతిదయాప్రియాభరణ కౌశికగోత్రగృహప్రదీప ది.
     గ్దంతిమదాంబుసేచనవిధానవివర్ధితకీర్తివల్లికా
     క్రాంతసమస్తలోక యవిఖండితసంతతదానవర్ష వి
     శ్రాంతమనోహరార్థిజనచాతక భూతలపారిజాత
క. అభినవభానుతనూభవ, విభవపురంధరలసద్వివేక బహుళసౌ
     రభసంవాసితమానస, సుభగీజనమదన నిఖిలశుభగుణసదనా.207