పుట:కుమారసంభవము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

43


యనఁగఁ బిశంగజూటరుచు లంబుదమార్గమునందుఁ బర్వభో
రనఁ జనుదెంచె నారదమహాముని తద్గిరిపాలుపాలికిన్.

325


వ॥

ఇట్లు చనుదెంచునారదమహామునిం గని యతిసంభ్రమంబున నెదురువచ్చి వినయ
వినమితోత్తమాంగుండై యాసనపాద్యద్యశేషార్చనలవిధి నభ్యర్చితుం జేసిన
గిరిపతికి నమ్మునిపతి గరుణించి హితోపదేశంబు సేయందలంచి శివశక్తిభేదంబు
లు దెలిపి పార్వతిపూర్వప్రపంచంబు విశేషించి యెఱింగించి మఱియు నాతనికి
మనోనిశ్చయంబు సేయ నభిముఖుండై.

326


క॥

ఈ దేవి లోకజనని మ । హాదేవున కగ్రమహిషియై పేర్మి సురేం
ద్రాదుల కర్చితయగు నని । యాదేశము సేసి యమ్మహాముని సనియెన్.

327


క॥

హిమవంతుఁ డెలమిఁ ద్రైలో । క్యము కలవడ నేలినంతకంటె మనోరా
మున నిజతనయఁ గులదై । వమ కాఁ గొనియాడుచుండె వదలక నెమ్మిన్.

328


వ॥

తదవసరమ్మున.

329


గీ॥

సతివియోగాగ్ని మనములో సంతతంబు । దగిలికొని కాల దానికిఁ దనుపుసేయఁ
దలఁచియో కాదు నిక్కమ దపము సేయ । వలచియో హిమగిరికి నీశ్వరుఁడు వచ్చె.

330


వ॥

ఇట్లు చనుదెంచి తదుపకంఠప్రదేశంబున నవతరించి.

331


సీ॥

రసరసాయననిర్జరప్రవాహానూనగంగాప్రవాహశీకరము లడరఁ
దనుపార నెలరారుఘనసారసురదారుమందారచంపకచందనములఁ
లలిన సర్వర్తుకఫలపుష్పపల్లవభరితలతాగుల్మతరువనముల
సురుచిరశశికాంతసూర్యకాంతానర్ఘమణిహేమమయకుట్టిమస్థలముల
వంశరుద్రాక్షమాలూరకింశుకముల । హంసకీరమయూరవిహంగమముల
ఋష్యసారంగమృగచమరీమృగములఁ । బావనం బగుదివ్యతపోవనంబు.

332


వ॥

కని యంత సహకారకర్పూరనారికేరనమేరుదేవదారుమందారపారిజాతజంబూ
జుంబీరాశోకాసేకలతామందిరాంతరంబున హిమవంతునిరంతరోపార్జితానంత
పుణ్యఫలంబునుంబోలె నవదాతశిశిరద్యోతితశశికాంతశిలాతలంబు సమాధిస్థా
నంబు స్వీకరించి నందిమహాకాళాదిగణముఖ్యుల నిజయోగంబులంద నియమించి.

333