పుట:కుమారసంభవము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

39


ట్మళ మలరంగ నున్న మధుమంజరి నా మదజృంభితాంగదో
హలరుచి నొప్పె గౌరి నవయౌవనసంగమలీల డాలుఁగాన్.

283


వ॥

ఇ ట్లభినవమధుసంగతిం దనరుప్రద్యుమ్నునుద్యానవనంబునుం బోనియౌవనమదా
భ్యుదయంబున.

284


క॥

మెలుపునుఁ గేపును సుస్థితిఁ । దలిరులయం దేని లేదు తమ కుమవలనన్
నిలుకడయగు నని తత్పద । తలముల నెలసెననఁ బాదతలము వొల్చున్.

285


క॥

సరసప్రవాళములపై । సరసిజరాగమణు లోలి సంధిల్లెనొ సుం
దరరాగలతాకందాం । కురములొ నా నుంగుటములు కోమలి కమరున్.

286


క॥

అరుణాంబుజదళములలోఁ । బరగు తణిత్తిషలు నించి పై నభ్రకముల్
పొర లెత్తి కదియమూసిన । కరణి నుమాదేవిపదనఖంబులు వెలుఁగున్.

287


క॥

తననీచయోని పడుటే । లని సకళత్రమును నుమపదారాధన కొం
దినవిష్ణుకమఠరూపమొ । యనఁ దగి మీఁగాళ్లు లగజ కందం బొందున్.

288


క॥

సిందూరపిండములొ మరు । కందుకములొ సత్ప్రవాళకఫలంబులొ నా
నందములై రాగలతా । కందము లన మడమ లచలకన్యక కొప్పున్.

289


క॥

అతనుం డోఁపనిశిపు వశ । గతుఁ జేసి భవాని మదనుకవదొన లతిలోకో
న్నతి నాఁచికొనియెనో యను । గతిఁ జిఱుఁదొడ లమరు వ్రీహిగర్భాభములై.

290


క॥

స్మరమందిరమ్ము శోభా । కరముగ మెఱుఁగారుపసిఁడికంబము లనఁగాఁ
గర మొప్పు నగతనూజకుఁ । గరభోరులు వొలుచు మదనకరికరలీలన్.

291


క॥

గురుకుచవహనభరంబునఁ । బొరిఁబొరిఁ బేదకపు నఱిగిపోఁ బోయిన ద
ద్భరవహనమునకు భరపడు । కరణిం జఘనంబు సతికి ఘనమై యమరున్.

292


క॥

కనుఁగొని యీశ్వరుదృగ్రుచు । లను విపులవహిత్రముల నపాంగజనార్ధిం
జనఁ దిగిచి ముంచుసుడి యది । యనఁ దగి యావర్తనాభి యద్రిజ కొప్పున్.

293


క॥

మారుమఘవేది మధ్యమొ । యారతియద్దంబు పిడియొ యున నెంతయుఁ బొ
ల్పారఁ గడు నలికమై సుకు । మారికి మధ్యంబు సింహమధ్యము వోలెన్.

294