పుట:కుమారసంభవము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కుమారసంభవము


వ॥

అస్మదీయజననీపరాభవం బింతయుం గావున నవశ్యంబుగ నిప్పని నాకు దయ
సేయవలయు నని పన్నుపడం బలుకు చున్నగణాధీశ్వరు తెగువ యెఱింగి దక్షా
ధ్వరధ్వంసంబు చేసి దక్షుం బట్టి తెమ్మని పరమేశ్వరుండు నియమించిన మహా
ప్రసాదం బని వీడుకొనియె నంత నాక్షణంబ.

195


ఉ॥

స్థూలసమున్నతాంగులు చతుర్భుజఫాలతటాక్షశూలకా
పాలకఠోరకార్ముకకృపాణధరుల్ ప్రమథాధినాథు లా
భీలపరాక్రముల్ నిఖాలభీకరమూర్తులు వచ్చి రోలిఁ గం
కాలసమేతులై భువనకంపముగా గణనాథుపాలికిన్.

196


వ॥

తదవసరంబున దేవగణాధీశ్వరి నిఖిలశాకినీడాకినీకూశ్మాండయోగినీగణపరివృతయై.

197


క॥

లోకాలోకములో గల । చీకటియెల్ల నొకపొడవు సేకొనియెనొ నా
నాకాశ మడరి వచ్చెను మ । హాకాళి మహాభయంకరాకారముతోన్.[1]

198


వ॥

ఇట్లఖిలగణపరివృతుండై గణాధీశ్వరుం డతిరయంబున దక్షప్రజాపతిపైఁ బరి
గొని దక్షాధ్వరావాసంబు గని కోపించి నిజగణంబులకుం జేయివీచిన నాక్ష
ణంబ.

199


సీ॥

క్రతురక్షుకులఁ దాఁకి కనుకనిఁ బోఁదోలి చూపఱ విదిశలు సొరఁగఁ దోలి
వడి జన్నసాలనివాసంబుగొని వేదికలు గ్రొచ్చి గుండముల్ గవియఁ ద్రోఁచి
ఋత్విగ్గణంబులఁ జత్వాలమున బాఁతి బలిమి సదస్యుల నలియమోఁది
యుపదర్శిమెడ నుల్పి యూపంబుతోఁ గట్టి పరిచారకుల బట్టి దారి సమరి
వహ్నిజిహ్వ రెండువ్రయ్యలుగాఁ గోసి పరిజనముల నేలపాలు చేసి
యాక్షణంబ ముట్టి దక్షాధ్వరం బశ్రమమునఁ జెఱిచి యార్చెఁ బ్రమథగణము.

200


ఉ॥

ఆయవనీసురాసురచయం బురుసత్త్వుల నుగ్రులన్ మహా
కాయులం దద్గణాధిపులఁ గాంచుచు మీఁదికిమీఁద జీవముల్

  1. చీకటి శబ్దమున నఱసున్న లేకున్నను లక్షణవేత్తలు పొరపడిరి. దశ
    కుమారచరిత్రమున "మీకృపగోరి భూరుహసమీపము చేరితి.......చీకటి రాత్రినాగహరి
    సింధురసూకరపుండరీక భ । ల్లూకపరీతకాననములో మిము నూఱడి నిద్రసేసెదన్" దశ.
    ఆ. 7 “ఏక సితాతపత్రముగ నేలును వీరనృపాలుఁ డుత్తమశ్లోకుడు..........చీకటి
    యుం గళింగమను....జిల్క సముద్రము.” శ్రీనాథుఁడు. “చీకటిగవిసినవిబుధానీకం
    బోడి.” నిర్వ. ఆ.6. అఱసున్న యున్నట్లు ధూర్జటి, రామభద్రుఁడును బ్రాసముల
    యందుఁ బ్రయోగించిరి. అది ప్రాచీనకవిమతము గాదు.