పుట:కాశీమజిలీకథలు -09.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7]

అశోకవతి కథ

49

కొంతదూర మేగువరకు రాజకింకరు లాటంకపరిచి పోవలదు. గుఱ్ఱము దిగుము. మా ప్రభువులు పాదచారులై తిరుగుచుండ నీ వెవ్వడ వశ్వమెక్కి పోవుచుంటి వాగు మాగుమని యదలించిరి. అతండు వారిమాట లేమియు వినుపించుకొనక పురవిశేషములఁ జూచుచు దత్తడిని నడిపించు చుండెను. అప్పు డేదియో యీల యూది నంత బెక్కండ్రు రాజభటు రాయుధపాణులై యరుదెంచిరి.

వాని గుఱ్ఱమున కడ్డము నిలిచి పోవలదు, దిగు దిగుమని నిర్భధించిరి. అతండు నాదారిం బోయెద. బోనిండు గుఱ్ఱముదిగి నడచువాఁడను కానని పలుకుచు గాలిమడమలతో గుఱ్ఱము కడుపుటకై నొక్కినంత నది రెక్కలుగలదివోలె రివ్వున నెగిరి వారిం దాటి యవ్వల బోఁ దొడంగినది. రాజభటులు బటురయంబున బరుగిడికొని పోయి వెండియు గుర్రమున కడ్డమైన కసలం దీసికొని యశ్వముఖంబున గొట్టుటయు నది చిందులు త్రొక్కుచు గొందఱ ఖురపుటాఘాటనంబులఁ బడనేసి గతాసులం గావించినది. ఆ వార్త విని యిరువురు రాజుల సైన్యములు ప్రోగుపడి వానిపయిం బడినవి. అప్పుడు రాజవాహనుడు రౌద్రాకారముతో నశ్వమును విచిత్రగమనంబుల నడిపించుచు విల్లెక్కువెట్టి యిట్టట్టనరాని పాటవంబున రాజభటుల బెక్కండ్ర యుద్ధవిముఖులఁ గావించెను.

ఎట్లయిన నొక్కఁడు పెక్కురతోఁ బోరుట గష్టము గదా! అట్లు వారితో మించిన పరాక్రమమున యుద్ధము చేయుచుండ హఠాత్తుగా నతనిచేతినుండి విల్లు జారి నేలంబడినది. ఎట్టి బలశాలియైనను దైవము మీరువాఁ డుండఁడుగదా! అశ్వముమీద నుండియే యా ధనుస్సందుకొనవలయునని తలంచి తన ఘోటకమును బాటవముగా దాని చెంతకుఁ జేర్చుచుండ నీలోపల శత్రువీరుఁ డెవ్వండొ యా కోదండ మెత్తికొని యవ్వలికి బారిపోయెను.

ఆయుధశూన్యుండయ్యుఁ బెద్దతడవు వారితోఁ బోరెను. అంతలో నేల యీనినట్లు వీథులన్నియు శత్రుసేనలచే నిండింపఁపడినది. ఆయుధశూన్యుఁడై యెటు బోవుటకుం దెరపి దొరకక చివరకు వారికిఁ జిక్కక తీరినదికాదు. చేత విల్లుండిన వాని మూఁడులోకము లేకమై వచ్చినను బట్టుకొనలేరు. అట్టి మహావీరుండు శత్రువులకుం జిక్కిపోయెను. రాక్షసులు హనుమంతుని బట్టికొనినట్లు రాజకింకరు లతనిం బంధించి తీసికొనిపోయి రాజశాసనంబునఁ జెఱసాల బడవేసిరి. మేము వాని వారమని తెలిసికొనిన మమ్ముఁగూడఁ బట్టికొందురని దెలుపక రెండుదినము లందుంటిమి. ఆ వీటిలో వానిం దలంచి కంటఁదడిపెట్టనివారులేరు. వాని పరాక్రమమును మెచ్చుకొనని వారును లేరు. ఆ రాజులు దుర్మార్గులఁట. వాని నేమి చేయుదురో తల్లి? వాని శత్రుపాలు చేసివచ్చితిమని పలుకుచు నాకింకరులు గోలున నేడువఁదొడంగిరి.

ఆ వార్తవిని కరవాలఖండితకరియుంబోలె అశోకవతి నేలబడి మూర్ఛిల్లినది. కొంతడికి తెప్పరిల్లి హా! మహావీరా! హా! పురుషసింహా! హా! సుగుణ