పుట:కాశీమజిలీకథలు -09.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవకన్యా వివాహము కథ

301

బ్రహ్మచారిని రాజుగాఁజేసె నీ మహారాజ ఉదారత వింటిరా అని సిద్ధులు చెప్పగా సాధ్యు లిట్లనిరి.

సాధ్యులు - శ్లో. మధ్యేసముద్రం క్వచిదద్రిశృంగే
                    దుర్గాలయే ప్రేతకబంధ యుగ్మం
                    చక్రేసజీవం పృథుసాహసేన
                    రాజేసి సార్థం ప్రవదంతి సాధ్యాః

సముద్రమధ్యంబున నొక పర్వత కూటమున నొప్పుచున్న దుర్గాలయమున మృతినొందిన రెండు మొండెములున్నవి. తలలు వేఱుగా నున్నవి. ఈ సాహసాంకుడా గుడివార్తవిని యక్కడికిఁబోయి శిలాశాసనము జదివి తన శిరఃకర్తనము జేసికొనఁబోవనంతలో నమ్మవారు ప్రత్యక్షమై యతని కంఠము కోసికొననీయక కత్తిపట్టుకొని యతని కోరిక ప్రకారము ఆ మొండెముల తలలతోఁ గలపి బ్రతికించి యంపినది.

అని యమ్మహాత్మునిపై తమదమ రచించిన గీతములన్నియు గంధర్వాదులు పాడినపిమ్మట సిగ్గభినయించుచు విక్రమార్కుండు లేచి వారికెల్ల మ్రొక్కుచు మహాత్ములారా ! నాయందు సుగుణ లేశమైన లేకపోయినను బుత్రవాత్సల్యమునఁ బెద్దగా నగ్గించుచున్నారు. ఇది నాకు సిగ్గగుచున్నది. మీ కనేక వందనము లర్పించుచున్నాను స్తుతి పాఠములు విరమింపుఁడని ప్రార్థించుటయు వారందఱు కరతాళములు మ్రోగించిరి.

అప్పుడు మదనమంజరి మెల్లన నతని ప్రక్కకుఁ బోయి మహారాజా ! నా ముద్దు చెల్లించి మాయక్క కూఁతురు త్రిపురసుందరిం బెండ్లి యాడితి నానందించితిమి. మఱియు దేవతా కన్యకలు పెక్కండ్రు భవదీయ గుణ ప్రఖ్యాపకములగు నుపాక్ష్యనములు విని నిన్ను వరించి విరహపరితాపంబు జెందుచున్నారు. వారందరు నీ సభకువచ్చి నీతోఁ జెప్పుమని నన్నాశ్రయించుచున్నారు. నీ వార్త జనశరణ్యుఁడవు గదా ! వారి నాపద పాల్సేసి యెట్లుపేక్షింతువు ? కరుణించి వారినందఱ భార్యలగా స్వీకరింపఁ బ్రార్థించుచున్నానని విన్నవించుటయు స్మేరాదకుర మనోహర వదనుండై దేవీ ? నీయాజ్ఞ యెట్లో యట్లు కావించెం నవహితుండ నైతినని పలుకుటయు నా యక్షకాంత తక్షణము యందున్న కన్యకల రప్పించిరి.

సీ. సకల కాకోదర సార్వభౌముండైన
                 వాసుకి మనుమురా లీసువదన
    గంధర్వవంశ ప్రకాశకుండగు చిత్ర
                రథు పుత్ర పుత్రి యీ రాజవదన
    ఈ కాంత విద్యాధరేంద్రు కూరిమి పట్టి
               కిన్నరకన్నె యీ సన్నుతాంగి