పుట:కాశీమజిలీకథలు -09.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐంద్రజాలికుని కథ

293

నేను - మహారాజా ! మీరు గుఱ్ఱముపై హుటాహుటీ పయనంబున బోయినను నాఱుమాసములు పట్టును. మా యక్షిణీ ప్రభావంబున గుఱ్ఱముతోఁగూడ మిమ్ము రెండు గడియలలో నుజ్జయనీ పురంబు జేర్చెద నంగీకరరింతురే ?

అనుటయు నమ్మహాత్ముం డౌను. నీ ప్రజ్ఞ మున్ను నే నేఱింగి నదియే. నన్ను గడియలో మలయవతి నగరముజేర్చి తెల్లవారకుండ వెండియు నింటికిం దీసికొని వచ్చిన నేర్పరివి. అట్లెకావింపుమని కన్నులు మూసికొనియెను. అశ్వసహితముగా రెండుగడియలలో నా నరేంద్రు నుజ్జయినీనగరము జేర్చితిని. వెండియుఁ బది దినములలో రమ్మని నాకాజ్ఞ యిచ్చుటయుఁ తనానతివడసి యిందు వచ్చితినని మదనమంజరి భర్తకు దనపోయివచ్చిన వృత్తాంత మంతయు నెఱింగించినది.

అని తెలిసి మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరావసథంబున నిట్లు చెప్పు చుండెను.

208 వ మజిలీ

ఐంద్రజాలికుని కథ

విక్రమార్కుండు కొల్వుకూట మలంకరించి హితపురోహిత మంత్రి సామంతాదులతోఁ దాను జూచివచ్చిన విశేషముల గురించి ముచ్చటింపుచున్న సమయంబున నొక యైంద్రజాలికుఁ డరుదెంచి నమస్కరింపుచు మహారాజా! తమ దివాణమున కైంద్రజాలికుఁ లనేకులు వచ్చియుందురు. వారి వారి విద్యాపాటవము మీరు జూచి యుందురు. మదీయవిద్యానైపుణ్యము గూడ దేవర పరీక్షింతురుగాక. అందులకై యరుదెంచితినని చెప్పిన నప్పుడమిఱేఁ డప్పుడు మాకుస్నాన సమయమైనది. ఱేపువచ్చి నీవిద్యాలాఘవము జూపింపుమని యజ్ఞాపించెను.

విక్రమార్కుండును మఱునాడు యథాకాలమునకు సకల సామంత మంత్రి పురోహిత పార వార సేవితుండై సభ నలంకరించి నిన్న వచ్చిన యైంద్రజాలికునిఁ బిలువుమని ప్రతీహారి కాజ్ఞాపించెను. అతండు ద్వారదేశ మంతయుఁ బరీక్షించి వాని నెందునుం గానక వచ్చి యాజాలికుఁ డెందును గనంబడలేదని చెప్పెను.

అంతలో నొకవీరుండు ఖడ్గహస్తుండై యతి మనోహర ప్రేక్షణీయలావణ్య భూయిష్టయగు వాల్గంటిని వెంటఁబెట్టుకొని యాసభా ప్రాంగణమున కరుదెంచుటయు వారిం జూచి సభ్యులు తెల్ల పోయి చూచుచుండిరి. అప్పుడు విక్రమార్కుడు నీ వెవ్వఁడవు. ఈ కాంత నీకేమి కావలయు నిందేమిటికై వచ్చితివని యడిగిన నవ్వీరుం డిట్లనియె.

రాజా! నేను మహేంద్రుని సేవకుండ నా పేరు వీరాస్వామి యండ్రు. సురపతి యొకనాఁడు నాపైఁ గోపముజేసి భూలోకమున గొన్ని దినములు వసింపుమని శపించెను. ఈ చిన్నది నా భార్య. ఇప్పుడు స్వర్గమున దేవతలకును రాక్షసులకును గొప్ప యుద్ధము జరుగుచున్నది. నన్ను రమ్మని వార్త వచ్చినది నేనుబోయి