పుట:కాశీమజిలీకథలు -09.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయవతి వివాహము కథ

237

యోషామణిం గడియలోఁ దీసికొనివచ్చి పెండ్లి జేయగలఁమని పలికిన విని కునుకుచు నృపతిలకుం డిట్లనియె.

మిత్రమా! నా చిత్త మదియేమియో కాని యా మత్తకాశినియం దాయత్తమై యున్నది. మనకు పోయియో చారుల నంపియో యెట్లో యామలయధ్వజునితో మైత్రిఁ గలిపికొని యారాచపట్టి నా చెట్టఁబట్టునట్లు కావింపవలయును. ఇందులకుఁ దగిన యుపాయ మాలోచించమని కోరిన విని సచివోత్తముఁ డట్ల కావింతునని యతని కుత్సాహము గలుగఁ జేసెను.

మఱియొకనాఁడు భట్టి శ్రీధరునితోఁ గర్తవ్యమును గురించివితిర్కింపుచున్న సమయంబున మలయధ్వజుని దూతలు కొందఱు మలయవతీస్వయంవరాహ్వానపత్రికలు దీసికొనివచ్చి యర్పించిపోయిరి.

మిత్రులిద్దరు ధాత్రీపని గత్తెఱం గెఱింగించి యానందసాగరమునఁ దీర్ధ మాడించిరి. అప్పుడు స్వయంవర దివసము ముప్పదిదినము లున్నను నృపాలుండు ప్రయాణమునకు వేగిరపడుచు దైవజ్ఞ నిర్దిష్ట శుభముహూర్తంబున మువ్వురు మిత్రులు ననుగమింపఁ జతురంగబలములతో బయలుదేరి కతిప్రయప్రయాణంబుల మలయవతీనగరంబున కరిగి యా నృపాలునిచే సత్కరింపఁబడి నియమితమగు విడిదయందు వసించి స్వయంవరోత్సవదివసంబున కెదురు చూచుచుండెను.

క్రమంబున నానా దేశములనుండి యనేకులు రాజకుమారులు వచ్చి యప్పట్టణ మలంకరించిరి. మఱియు వారు విక్రమార్కుని రాక విని -

చ. వితరణశాలి సర్వపృథివీజయలబ్ధయశుండు విక్రమ
    క్షితిపతి వచ్చె నింక సరసీరుహలోచప యాశుభాంగునిం
    గుతుకములో వరించు మనకుం దలవంపులు గావంగనేల వ
    చ్చితి మకటా? యటంచు మదిఁ జింతిలఁ పాల్పడి రెల్ల భూపతుల్.

మలయవతియు సఖీముఖముగా విక్రమాదిత్యుని రాక విని రాకాగమనంబునకు నుప్పొంగు భంగమాలియుంబోలె హృదయంబు సోత్సుకతంబొరయ సుమూర్తంబు ప్రతీక్షించుచుండెను.

సీ. కడువెన్నెలమరునిగారింపు పట్టుపు
               ట్టము కుటీరాంపరాళమున పరుస
    శ్రేణిగావైచిన సింహాసనముల నా
              త్మీయప్రభుత్వప్రమేయసరణి
    సకలదేశావనీశ్వరకుమారులు మార
             సన్నిభాకారు లైశ్వర్యగరిమఁ
    దెలుపు చిహ్నములతో నెలమి నాసీనులై
            యవ్వధూమణిరాక నరయుచుండ