పుట:కాశీమజిలీకథలు -09.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    బాబాకమనీయ దేహారుచులా హొయలేమని చెప్పువాఁడ నా
    హా! కనకాంగి రూపు తెలియంబడు గన్నులఁ గట్టినట్లుగాన్.

వయస్యా! ఆ భాసురగాత్రి రూపలేఖా విలాసము లిందు వ్రాసితిని. చూడుము. అని తాను వ్రాసిన చిత్రపటము చూపుచు ఇది సముద్రము. ఇది యా ద్వీప మీదారిఁ బోయిన నీ పట్టణము జేరుదుము ఇది యవ్వటి శృంగాటకము. ఇదియే యా చేఁడియయున్న మేడ. ఇదిగో యేడవ యంతరమున హంసతూలికా తల్పంబున నా చిన్నది పండుకొనియున్నది, తిలకింపుము. శయ్యదిగి వచ్చిన యా మచ్చకంటి రూపమిది. మా చిట్టకంబులివి కంటేయని యా స్వప్న విధాన మంతయుం జూపించెను.

శ్రీధరుఁడు తతల్లేఖన చమత్కారము తత్సుందరీ సౌందర్య ప్రతిభా విశేషముం జూచి తలయూచుచు-

గీ. స్వపరబ్ధపదార్థంబు చంచలంబు
    గాక సత్యంబె యిది యెఱుంగవె నృపాల
    ధాత్రి మృగతృష్ణలో నీరు ద్రావఁదివురు
    నట్లు వలన తగాంతువే యతివకొఱకు.

సర్వజ్ఞుండవు. నీ యెఱుంగునది కలదే? దేవకాంతలు వచ్చి వరింప దిరస్కరింతు. వీయింతి నిమిత్త మిట్లుత్తలపడ నేమిటికి ? స్వస్థచిత్తుండవై యాస్థానమునకు రమ్మని బోధించిన నా రాజపంచాస్యుం డుస్సురుమని నిట్టూర్చు నిగుడించుచు నిట్లనియె.

మిత్రుడా! నీ వనినట్లు స్వప్నోపగతం బసత్యంబని యెఱింగియు నా భ్రాంతి బోకున్నది. ఆ చిన్న దానివలపు నా డెందము లాగినది. నేఁడు పండుకొని నిద్రించునప్పుడు తత్స్వప్న విశేషంబు వెండియుం బొగగట్టునేమోయని యాసగా నున్నది. నేఁడిందు వైతాళికుల లేపవద్దని చెప్పుము. నా యంతట లేచువఱకు నన్నెవరు మేల్కొలుపఁగూడదు అని యతనికిం జెప్పి యొప్పింపఁజేసి యారేయి నా జవరాలిం దలంచికొనుచు నా భూపాలుండు నిద్రపోయెను.

మదనమంజరి విక్రమాదిత్యు నంతఃపురంబునఁ దిరోహితయై వసించి వారి సంవాద మంతయు నాలింపుచు నా చిత్రపటముఁ జూచియున్న కతంబున నందు వ్రాయఁబడిన రూపము మలయవతిదని గ్రహించి ఘటనా చమత్కారమునకు మిక్కిలి వెఱఁగందుచు దాను దలంచిన పనికి దైవము తోడ్పడెనని సంతసించుచు మెల్లన దాపునకుఁబోయి యక్షిణీ ప్రభావంబున నతనికి మైకము గలుగఁజేసి యెత్తికొని సత్వరంబున మలయవతీ నగరంబునందలి మలయవతి యంతఃపురమునకుఁ దీసికొని పోయి రాజపుత్రిక పండుకొనియున్న తల్పంబునం బండుకొనఁబెట్టి తిరోహితయై యా ప్రాంతమున నిలువంబడి చూచుచుండెను.