పుట:కాశీమజిలీకథలు -09.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయవతి కథ

227

వింటిని. పరమానందముతో నే నమ్మహానుభావుని పాదంబులంబడి మహారాజా ! నీవు బ్రహ్మాదులచేఁ జేయశక్యముగాని యుపకారము నాకుఁ గావించితివి. ఇందులకుఁ గృతార్థురాలనైనా యావజ్జీవము మీ నామము స్మరించుకొనుచు మీ భక్తులమైయుండుట తప్ప ప్రతిక్రియ యేమియుం జేయఁజాలనని పెద్దతడవు వేడికొంటిని.

అమ్మహాత్ముఁడు మందహాస సుందరవదనారవిందుడై సుందరీ? మీరు వేల్పులు. మేము మనుష్యులము. మీరు సంతసించుట మాకు మహా ప్రసాదముగాదా? ఇంతకన్నఁ బ్రతికియు యేమి యున్నది? నీ పలుకుల కానందించితి. పదిలముగా నింటికిఁ జనుమని యానతిచ్చుటయు నేను పలుమా రాపురుషసింహుని పాదములకు మ్రొక్కి మ్రొక్కి యొక్క భర్తం గలసికొని యత్యంత సంతోషముతో నింటికిం బోయి పునర్జన్మ మెత్తినట్లుగా జుట్టాలం గలసికొని యానందించితిని. మలయవతీ వినుము -

క. చేసిన యుపకారము మది
   భాసిల్లఁగ నోపినంత ప్రత్యుపకారం
   బాస క్తిఁ జేయకుండిన
   సీ. సీ. యాజీవిదొక్క జీవమె చెపుమా ?

అని తలంచి భూమండలసామ్రాజ్య బంతయు నొక్క గవ్వఁగానైన గణింపక యర్థిసాత్కృతము గావించెడు నావితరణశాలికి నే నేమిచ్చి సంతోషపరచగలను. చతుస్సముద్రముద్రితమైన భూచక్రబంతయు బరిభ్రమించి యా తేజోమూర్తికి సరిపడిన లావణ్యవతి నేరితెచ్చి పాణిగ్రహణవిధి నెఱవేర్పించెదనని యుడుత భక్తిగాఁ దలంచి బయలుదేరి యేబదియారు దేశంబులుం దిరిగితిని. ఎందున దగిన యిల్లాలు గనంబడదయ్యె. ద్వీపాంతరధరాకాంత సంతానముల నరయు తలంపుతో నీ దెస కరుదెంచితి నిదియే నావృత్తాంతమని మదనమంజరి మలయవతికిఁ దనవృత్తాంత మంతయు నెఱింగించినది.

అని చెప్పువఱకు వేళ యతిక్రమించినది. పై కథ తరువాత నివాస దేశంబునం జెప్పఁబూనెను.

201 వ మజిలీ.

మలయవతి కథ

అట్లు మదనమంజరి తం యాగమనకారణరూపముగా విక్రమార్కుని యుదంత మక్కాంతామణి కెఱింగించి యంతలో పార్వతీపూజాసమయ మగుటయు దత్సఖీనివేదితమగు గదియందు వసించి దేవతార్చన గావింపుచుండెను.

అప్పుడు మలయవతి తలోదరితో సఖీ ! యిప్పుడీమె జెప్పినయుపన్యాసము వింటివిగద. ఆ విక్రమార్కుఁడే నీకు దగిన వరుండని సూచించినది. అతని చరి