పుట:కాశీమజిలీకథలు -09.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(29)

టింటాకరాళుని కథ

225

సీ. ఎవని యిచ్ఛామాత్ర నింద్రాదిదేవతల్
             శాశ్వతైశ్వర్య విస్పారులైరి
    యెవఁడు నిరీహుండై భువనరక్షకుఁదాల్చుఁ
             గరళకపాలాదికములనెల్ల
    నెవ్వాఁడు కినుకఁ గన్నెఱ్ఱఁజేసినయంత
            సకలలోకములు భస్మంబులగును
    ఏ వానికరుణ రాజీవసంభవహతి
            ప్రముఖామరాశికి ప్రాసరంబు
గీ. అట్టి నీవల్ప హేతువు బట్టి యిట్టు
   లోడఁదగునయ్య కడులోభివై మహాత్మ!
   యాశ్రితామరవృక్షంబ వండ్రునిన్ను
   నట్టి వాడుకయేలఁ బోఁగొట్టుకొందు.

ఉ. బాలశశాంకశేఖర! కపాలమున న్భుజియింతు నీవు మైఁ
    జాల విభూతిఁ బూయుడు స్మశానమున న్వసియింతు వేను నే
    వేళ విభూతిఁ బూసికొని వేడఁగపాలమున న్భుజింతునా
    భీల తరస్మశానమున వృత్తిసమానమె నీకు నాకజా !

అని స్తుతియించుటయు భక్తజన వత్సలుండగు మృత్యుంజయుండు వానియం దనుగ్రహము జనింప నోరీ నీవీ కోవెల నాశ్రయుంచుకొని యుండుము. శుభంబులు జేకూరునని వచనముగాఁ బలికెను.

అప్పలుకులు విని కులుకుచు వాఁ డాగుడి విడువక తిరుగుచుండ నొకనాఁడు రాత్రి మహాకాళీ తీర్థంబునఁ గొందరు దేవకన్యకలువచ్చి జలక్రీడ లాడుచుండిరి. ఆ రహస్య మెఱిఁగి టింటాకరాళుం డలంబున కూఁతురు కళావతియను నచ్చర గట్టునం బెట్టిన పుట్టం బెత్తికొనిపోయి దాచెను.

దానంజేసి యా మచ్చెకంటి వానికి భార్యగ నుండక తప్పినది కాదు. ఆ కళావతి పగలెల్ల నాకమున నింద్రునకుఁ బరిచర్యలు సేయుచు రాత్రులువచ్చి యీ జూదరిని మదనక్రీడలచే ముఱియఁజేయుచుండునది. నాఁడు వేఁడుకొన నా చేడియ యొకనాఁడు వాని నాకసమునకుఁ దీసికొనిపోయి యందలి వింతలం జూపించి వెండియుం దీసికొని వచ్చినది.

ఆ వార్త యింద్రుండెఱింగి యక్కురంగనయనను గజపురంబున నున్న దేవళములోని శిలాస్థంభంబున సాలభంజికగా నుండుమని శపించుచు నాయాలయము నేలమట్టమైనప్పుడు శాపాంతమగునని యానతిచ్చెను.

ఈ రహస్య మాయజ్ఞాస్మ వానిచెవిం బడవైచి శాపం బనుభవింపఁ బోయినది. ఆతాపసియు దద్వియోగంబునకుఁ బరితపించుచుఁ దాపసవేషంబు ధరించి