పుట:కాశీమజిలీకథలు -09.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మ. ఒకనా డిర్వురు తాపసోత్తములు మంత్రోపాసనాసక్తిఁ గా
     శికి బోవంగని మార్గమధ్యమున నా సిద్ధార్థుల న్మీఁదు గా
     నక నిభ్యాధికులంచు భూరిలగుడన్యాసంబుల న్భిన్నమ
     స్తికులంజేసి వహించినార మొడలంతన్బాసి యీరూపముల్ .

భూతభేతాళ శాకినీ ఢాకినీ ప్రభృతులు మారు వెఱచుచుండు. మేము భూమండలంబెల్ల నిరాటంకముగా సంచరింపుచు మాంత్రికులకు లొంగక తాంత్రికుల లక్ష్య పెట్టక --

సీ. నెలఁదప్పి బాహ్యసీమలఁబండుకొనెడు రా
                  కాసుధాకిరణ సంకాశముఖులఁ
    బ్రసవమె జాతకర్మ సమయంబున బిడ్డ
                 తోఁ బీటఁ గూర్చున్న తొయ్యలులను
    ప్రథమార్తవమునఁ దీర్థంబాడు నాఁడు వెం
                డ్రుక లార్చుకొను సరోరుహ వదనలఁ
    బట్టాభిషిక్తయై పట్టపేనుఁగ నెక్కి
               భర్తతో నూరేగు పడఁతుకలను
గీ. పట్టికొని రక్తమాంసముల్ దొట్టి పీల్చి
   పిప్పిచేయుచుఁ గడదేర్చి విడుతు మహహ!
   మాంత్రికులు తాంత్రికులు పెక్కుమంది వచ్చి
   దెచ్చి రొక్కట మాదుతర్జనల కడలి.

గీ. పురుగుపట్టిన పెనుమొక్కవోలె మేము
   చేరిపట్టిన సఖి కడతేరు వఱకు
   విడుచువారము గామెట్టి విధులనైన
   బ్రహ్మరాక్షసులనఁగ దుర్భరులుగారె ?

అట్లు పెక్కండ్ర జవరాండ్ర రక్తమాంసములఁ బొట్టలం బెట్టుకొనియుఁ దృప్తివహింపక భూమండలంబెల్లఁ బరిభ్రమించుచు గ్రహచారము సాలక యొకనాఁ డీయుజ్జయినీపురంబు జేరి యిందు మంత్రిపుత్రికయు షరాబుకూఁతురును నుద్యానవనములో విహరింపుచుండఁ జూచి యోర్వఁజాలక వారిం జెరియొకరము నావేశించితిమి.

క. తల విరియఁ బోసికొని వలు
   వలు వారఁగ దండఁ జఱచి వనితలు తమ్ముల
   కలవఁగ వచ్చిన చుట్టం
   బుల బాదిరి మీఁదఁ బడి సముద్రేకమునన్.

అప్పుడు వారిని భూతావిషులగాఁ దలంచి దధిష్టు లతిజవంబునంబోయి