పుట:కాశీమజిలీకథలు -09.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనమంజరి కథ

207

సానంబున, ఖడ్గహస్తుండై ప్రాంతంబున నిలువంబడియున్న విక్రమార్కుం గాంచి మహారాజా! నే నర్చించిన యీ మహాదేవతకు నీవును సాష్టాంగనమస్కారము గావింపుము. శుభంబులు సేకూరునని యుపదేశించిన విని యతండు భేతాళునిచే నంతకుమున్ను తదీయదుశ్చేష్టితం బెఱింగి యున్నకతంబునఁ గపటంబుగా నిట్లనియె.

పరివ్రాజకా! సాష్టాంగనమస్కారము నెట్లు చేయవలయునో నే నెఱుంగను. నీవు గావించి చూపిన నట్లు చేయువాఁడనని పలికిన విని యాదుష్టుండు సాష్టాంగముగా నేలం బండుకొని యిట్లు చేయుమని పలుకుచుండఁగనే యామండలాధిపతి తన చేతనున్న మండలాగ్రంబున వాని శిరంబు ఖండించి తదీయ హృదయపిండములతో తద్రక్తంబు భేతాళునకు నైవేద్యము గావించెను అప్పుడు సాధు! మహారాజా! సాధు, అని భూతభేతాళాదు లతని వినుతించినవి.

నరకళేబరమున వసించిన భేతాళుండు తుష్టుండై దివ్యరూపంబున నెదుర నిలువంబడి మహారాజా! సకలసద్గుణసంపన్నుండవు సాహసధైర్యస్థయిర్యాదుల నిన్నుఁ బోలిన వాఁడెందును లేఁడు. క్షపణక బలిప్రదానపుణ్యంబున నేన కాక నీకు భూతభేతాళశాకినీఢాకినీపిశాచాదులు వశ్యంబులై యుండగలవు నీపేరు దలంచినంత భయాక్రాంతస్వాంతములై పారిపోవును. నీవు తలంచినప్పుడెల్ల వచ్చి నీకు దాసుండనై చెప్పిన పనుల సాధించుచుండెదను. అని మఱియు ననేకవరంబు లిచ్చి యా భేతాళుండు నిజవాసంబునకుఁ బోయెను.

విక్రమార్కుండును క్షపణకుండు కావించిన దుశ్చేష్టితమును గురించి వితర్కింపుచు ఖడ్గహస్తుండై తెల్లవారక పూర్వము స్వసదనంబు బ్రవేశించి జరిగిన వృత్తాంతమంతయు భట్టికిం జెప్పి శాంతికపౌష్టికాదిహోమంబుల గావించి క్షపణకవధ మహాపాతకము వాయఁ జేసికొనియెను.

200 వ మజిలీ

మదనమంజరి కథ

మ. చేసిన యుపకారము మది
     భాసిల్లగ నోపినంత ప్రత్యుపకారం
     బాసక్తి జేయకుండిన
     సీ, సీ, యాజీవ మొక్క జీవమె యెందున్.

ఆహా ! మహానుభావుఁడు విక్రమార్కచక్రవర్తి నాకుఁ గావించిన యుపకారము నీకు నేనేమి చేయఁగలదానను ధనకనకవస్తువాహనాదు లిచ్చి సంతసపరుతమన్న మే మీయగలన్యామాజ్య బతండు గవ్వఁగానైన లెక్కఁగొనఁడు. తదీయసాహసయుతరణాలు గలగుణగణంబులు త్రిభువనాశ్చర్యకరంబులుగా నున్నవి. ప్రాణము తృణ