పుట:కాశీమజిలీకథలు -09.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మండోదరి కథ

173

సమర్పించి వచ్చుచుండునది. ఏదిన మీయకపోయినను మండోదరి కడు పుబ్బు చుండును.

ఇళ్ళు పొలములు నమ్ముకొని యాజన్మాంతము కాఁపువానికి నేతి నిచ్చుచుండిరి. మిత్రుఁడా! నా చరిత్రము నట్లెయున్నది. నీకడ నిజము దాపనేల? నేను మొదట నీ సంకల్పము విని పిచ్చివాఁడవని తలంచితిని. తరువాత నీ వంటి ధన్యుఁడు లేఁడని యానందించితిని. నీవు వోలె నేను గూడ నా సిద్ధు నాశ్రయించినఁ బాదలేపన మీయక పోవునా? దానఁ బుణ్యలోకముల కరుగకుందునా? అని తలంచితిని కార్యసాఫల్యమైన పిమ్మట నీవువోలె నేనును కృతార్థుఁడ నై తినని నీతోఁ జెప్పవలెనని యెంచి మొదట నా సంకల్పము నీతోఁ జెప్పక వెండియుఁ గాశీపురంబున కరిగితిని.

భక్తిపూర్వకముగా గంగలో స్నానము జేసి విశ్వనాథు నారాధించి యెట్లో నీవు జెప్పిన గురుతుల ననుసరించి పశ్చిమముగాఁ బోయి యా సిద్ధుని పర్ణశాల గనుగొంటి. నదియును శిథిలమై దళ్ళకును గప్పునకును వైచిన తాటియాకులు చెదలుపట్టి పుట్టలు పెరుగఁ జూచుటకు భయంకరమై మనుష్యసంచార మెన్నఁడును లేని దానివలె గడ్డిమొలచి జీబురుమనుచు వెలయుచున్నది.

కొంతసే పది యగునా కాదా యని సందియ మందుచు ప్రాంతమం దట్టిది మఱియొకటి లేమింజేసి యదియే యని నిశ్చయించి తెగించి యా పుట్టలోనే యొకచో నిలువంబడి చేతులు జోడించి యా సిద్ధు నిట్లు ధ్యానించితిని.

ఉ. ఓ మహనీయ నైష్టికగుణోత్తర! యోకరుణాలవాలా! ని
     ష్కామనిరస్థ సంసృతివికార! విరక్త సురక్త భక్త చిం
     తామణి వంచు నీదగు పదంబులఁ బట్టఁగ వచ్చితిన్ యతి
     గ్రామణి భక్తు శిష్యువెసఁ గామ్యములిచ్చి యనుగ్రహింపుమీ.

క. అణిమాది సిద్ధి సంధన
    గణనా తీత ప్రభావ కర సిద్ధ గ్రా
    మణి వంచు నిన్ను నెల్లడఁ
    బ్రణుతింపఁగ నాశ్రయింపఁ వచ్చితిఁ దండ్రీ !

గీ. గంగలోపలఁ బడి దైవికమున నీదు
    చరణములఁ బట్టినంత నా సఖుని వెతలు
    వాయ సురలోకమున కేగఁ జేయవే మ
    హాత్మ! నేఁడు ప్రసాదింపు మట్లు నన్ను.

అని చీఁకటి పడువఱకు నా సిద్ధుం బ్రార్థించుచు నెవ్వరి గానక నందుండ వెఱచి మఱలఁ గాశీపురంబున కరిగితిని. ప్రతిదినము ప్రొద్దున్న లేచి గంగాస్నానము జేసి విశ్వపతి నారాధించి యాపాడుపర్ణశాలకుం బోయి సాయంకాలము దనుక సిద్ధుం బ్రార్థించుచు జీకటి పడినంత దనుగ్రహము గలిగినది కాదు. అప్పుడు నా మనస్సు

.