160
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
యతం డుపాయము చెప్పుటచే నూరకొంటిని. నాఁటి కందఱము నింటికిం బోయితిమి.
అని యెఱింగించి తరువాయి కథ యవ్వలి మజిలీ యందిట్లు చెప్పదొడంగెను.
195 వ మజిలీ.
విద్యావతికథ
విద్యావతి స్వయంవరసభ మిక్కిలి విశాలముగా నున్నది. శ్రేణులుగా గురుతులు వైచి పీఠము లమర్పించిరి. పద్మవ్యూహము దారివలె మధ్యపీఠము మొదలు గుండ్రముగా నామార్గము తిరిగి పీఠములన్నిటినిం దగిలి బైటకు వచ్చును. విద్యావతి వరించునని వచ్చువారందఱు తమతమ పేరులు నధికారము జాతి మొదలగు చరిత్రాంశముల ముందుగనే తెలియఁ జేయవలయునఁట. గురుతువైచి వారికి పీఠము లుంచుదురఁట. ప్రేక్షకులుగా వచ్చువారి కవి యేమియు నవసరములేదు. మూఁడవనాఁడు పదిగంటలకు సభ కూడినది.
దేవలోకములనుండి యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు విద్యాధరులు లోనగు ప్రముఖులందరు వచ్చి సభ నలంకరించిరి. జయంతుఁడు నలకూబరుఁడు దిక్పతిపుత్రులు కావున వారికి వావులు కుదరమి రాలేదు. తక్కుంగల దిక్పతిపుత్రులును గూడ రాలేదు. వేల్పులు జాతివైరము దలంచి యుపేక్షఁ జేసిరి.
మాయింటి యజమానుని బలవంతమున నేనుఁగూడ దివ్యమాల్యాంగరాగానులేపనములతో నూత్నరత్నభూషాంబరాదుల ధరించి యాసభకుఁ బోయి ప్రేక్షకులు గూర్చుండుచోట నొకపీఠముపైనిఁ గూర్చుంటి.
అప్పు డాయోలగంబున వసించియున్న దేవయోనివిశేషుల వేషములం జూడఁ గన్నులకు మిరిమిట్లు గొలుపుచుండెను. గంట మ్రోగినది. సభాజన కలకల ముడిగినది. సభాంతరాళంబున నున్న తెర లాగఁబడినది. మబ్బు వెల్వడిన మెఱుపు తీగవలె మెరసి యాసరసిజగంధి సభ్యులకు నేత్రపర్వము గావించినది.
సఖీహస్తావలంబినియై ముందొక సఖురాలు వారివారి యుదంతము లెఱింగింపుచు మెల్లఁగా నడుచుచుండఁ దానును వారివారి సోయగముల వారచూపుల నాలోకించుచు నడుచుచుండెను.
సీ. ననల గంధర్వవంశప్రదీపవరుఁడు వి
శ్వావసుం డనువాఁడు వాఁడె చూడు
మితఁడె చిత్రరథుండు మతిమంతుఁ డితఁడు తుం
బురుఁడు గానకళాప్రభూతయశుఁడు