పుట:కాశీమజిలీకథలు -07.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయా వసిష్ఠుని కథ

45

సియే దాటించిరి? కావున మీకు మేమిచ్చిన లంచపు సొమ్ము మాకీఁయుడు. లేకున్న వారి నప్పగించుడు. ఈ రెంటిలో నేదికావింతురో చెప్పుడని యడిగిన బ్రహ్మానందయోగి యిట్లనియె.

మీరు మాకు నియమించిన వేషములు వైచితిమి. చేయవలసిన పని యభినయించితిమి. వారిం గాచి తిరుగుటకు మేము పూటకాపులము కాము. వారు మీరు చేయు కపటము దెలిసికొని పారిపోయిరి? మేము పెద్దవాండ్రము అడవులలోఁ దిఱుగఁజాలము. మిమ్ము దైవము తోడుగా మోసము చేయలేదు. మీకు సొమ్మియవలసిన యవసరము లేదని పలికిన విని చిదానందుఁ డిట్లనియె.

మా వలన మీరిద్దరు జాల లంచము తీసికొంటిరి. ఫలముదక్క లేదు మా సొమ్మంతయు వృధయై పోవలసినదియే ఇట్టి యన్యాయ మెందైనంగలదా ప్రద్యుమ్నయోగి యొద్దకు బోవుదము రండు అతండు చెప్పినట్లు చేయుదము. అనుటయు బ్రహ్మానందయోగి అక్కడికే వత్తము పదుఁడు పదుఁడు అతఁడు మాత్రము మీ యొద్ద లంచము తీసికొనలేదా? అని పలుకుచుండ నందరు ప్రద్యమ్నయోగి యొద్దకు బోయిరి.

109 వ మజిలీ.

యమునాదీరంబునఁ బ్రద్యోతన నగరము వికాజిల్లు చున్నది. అందలి ప్రజలు అకస్మాత్తుగాఁ బొంగిన యమున వృత్తాంతమువిని యావింత జూచుటకై వేకువజామున లేచి తీరమున కరుదెంచిరి. పాతాళము నుండి జలంబుపై కులుకుచున్నదియో యన వలవైచినట్లు చుట్టును జేరి సుడిగుండములతో నంచుదేరిన నురగలం జదునై వట్రువట్రువుగా నీరు బొంగుచుండ నత్తరంగిణీ విశేషంబుల జనులు వీక్షింపుచుడిరి.

“భూధరసమితి” మగనికడ కరుగు మిత్రనందునకుఁ గానుక లొసంగఁ దీసికొని పోవుచున్నదియో యన మధురఫలపీతారుణ కుసుమదళ మనోహరములై నమూలపతితంబులగు మహావృక్షంబు లెన్ని యేని బ్రవాహమున గొట్టుకొని పోవుచుండెను. ఈతగాండ్రు పెక్కండ్రు విప్లవంబురాకుండఁ బ్లవంబుల నురంబుల నానుకొని యీదికొనిపోయి పెద్ద పెద్ద మ్రానుల దీరంబునకుఁ త్రోసికొని వచ్చుచుండిరి. మఱికొందఱు ద్రోణివిశేషంబులచేఁ గట్టెలం దీయుచుండిరి.

అట్టితరి, నదిగో పెద్ద దారువు గొట్టికొని వచ్చుచున్నది. వడిగా నీదుము. ఈదుము. దానికొఱ కవ్వలనుండి యెవ్వడోఁ తెప్పవాల్చుచున్నాఁడని యొడ్డునం గూర్చుండి స్నేహితులు ప్రేరేపింప నొక యీతగాఁడు తెప్పవాల్చి తెప్పున నొక కర్రకొర కీదికొని పోవుచుండెను. దానికొఱకే అవ్వలి రేవునుండి మఱియొకఁ డీదు