పుట:కాశీమజిలీకథలు -07.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఆవైశ్యుఁడు వానియెడఁ గృతజ్ఞతజూపుచు వారిస్థితినిగుఱించి పరితపించుచుఁ దన యింట దావిచ్చి రహస్యము బయలుపడనీయక కాపాడుచుండెను.

చంద్రగుప్తుఁడు తన కత్యంత ప్రియమిత్రుఁడైన వజ్రదత్తుని కొకజాబు వ్రాసి యావైశ్యునిమూలముగ నతనియొద్ద కనిపెను. విశోకునిచే జయింపఁబడి మేము ప్రచ్చ న్నముగా నీనగరమున వసియించియున్నవారము. మాకుఁ గొన్ని సాధనములును సేనలుం బంపితివేని వీనిం బరిమార్చి రాజ్యము మేము గైకొందుము. దీనదశజెంది యున్న మాకీపాటియుపకారము జేయవలయునని యాజాబునందున్నది.

ఈలోపల వికటదంతుఁడు విశోకునొద్ధకుఁ బోయి చంద్రగుప్తుఁడు భార్యా పుత్రులతో వచ్చి ప్రచ్చన్నముగా నీయూరఁ బ్రవేశించి యున్నవాఁడు. నన్నుఁ దావీ యమని యడిగిన నిచ్చితినికాను. ఎంత ప్రచ్చన్నముగా వసియించి యున్నవాఁడు. నీయంతరములు వెదకుచుండును. మీకు హితుండగాన నింతజెప్పితినని యెఱింగించిన నతఁడు జడియుచు, వానిజాడ దెలిసి కొనుటకుఁ బెక్కండ్రరాజపురుషుల గూఢచారుల నియోగించెను.

ఒకగూఢచారుఁ డెట్లో జాడలమీఁద వైశ్యగృహ సంస్థితులగు వారియుదంతము తెలిసికొని విశోకునికిఁ దెలియజేసెను అతండు దండనాధపురస్సరముగాఁ బెక్కండ్ర దూతలనంపి హఠాత్తుగా వారినందరం బట్టుకొని నిగళములు దగిలించి కారాగారంబునఁ బడవేయించెను.

అని యెఱింగించి...

141 వ మజిలీ.

సూర్యవర్మకథ

ఆహా! దైవము ధర్మమునందు వసియింపఁడా? దైవమే వచ్చి మనకుఁ దోడ్పడి మనశత్రువగు సూర్యవర్మం గడతేర్చెను. అని దేవవర్మ యల్లునితోఁ గూతురితో ముచ్చటించుటయు యమున యమ్మహాభూతస్వరూపుండైన పరమేశ్వరుండు చక్ర వర్తిస్థానంబున మఱి యెవ్వరినో నిలిపెనని చెప్పుకొనుచున్నవారు మీకేమైన వర్త మానము దెలిసినదా? వార్తవచ్చినదా అని అడిగిన నది కింవదంతియేకాని నిజమైన వార్త దెలియదని అల్పుఁడు జెప్పెను.

ఆమాటలోనే యొకదూతవచ్చి వాకిట నిలిచి చక్రవర్తిసందేశ పత్రిక లోపలి కనిపెను. అదివిప్పి చదువ నిట్లున్నది.

దేవయజనాగ్రహార కాపురస్థుఁడగు నగ్నివర్మకూఁతురు సురస అల్పునిపై