పుట:కాశీమజిలీకథలు -07.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35]

యుద్ధము కథ

273

కబళములైరి. చక్రవర్తిం బట్టుకొని కాలిక్రిందవైచి నలిపి చంపెనను వార్త వ్యాపించి నది

ఎవ్వరు మడిసిరో ఎవ్వరు పారిరో లెక్కతెలియదు. వాఁడు బ్రహ్మరాక్ష సుడో భూతమో దయ్యమో తెలియదు. అది మహాప్రళయమువలెఁ దోచినది. రుద్రుండొ భైరవుండొ మృత్యువో యట్టి కార్యము గావించెనని చెప్పుకొనుచున్నారు. అర్దరాత్రముదనుక నట్టిసంహారముగావించి యాభూతమెందేని బోయెను ఇంతవట్టు చూచి పారిపోయివచ్చితిమని చెప్పిరి.

ఆకథవిని పృదివీపతి యురస్తాడనముగావింపుచు కుశుఁడేమయ్యె సుకుమా రుఁడు సేమమా ? అని అడిగిన వాండ్రు దేవా! మాకెవ్వరును గనంబడలేదు. ఎవ్వరి నడుగుదుము మాటాడిన వాఁడువచ్చిమీదఁబడునేమో అని కిక్కురుమనక మెల్ల మెల్లన దప్పించుకొని పారిపోయి వచ్చితిమి. శత్రుసేనదెస వసియించిచూచుటచే మేము బ్రతికితిమిగాని లేకున్న మేమును నీపాటికి శమన లోకాతిధులమై యుందు మనిచెప్పిరి.

పోపొండు మనవారి సేమము తెలిసికొనక వచ్చితిరేల? వారేమైరో తెలిసికొని వేగమరండు అని నియోగించి రాజు ఆ వృత్తాంతము రతితోను ధర్మవతితోను జెప్పి పరితపించుచు దూతలరాకకు నాతురపడు చుండెను.

మరునాఁడు రెండుగడియల ప్రొద్దెక్కునప్పటికి సందేశహరులు వచ్చుటజూచి పౌరులు హాహాకారములు గావించిరి. వాండ్రు రాజనగరకిం బోయి ఱేనింజూచి యేమాటయుం జెప్పునేరక గోలుననేడువఁ దొడంగిరి.

రాజు హృదయము భేదిల్ల ఆ? ఏమీ! దైవమా తలఁచినట్లె జరిగినదియా యని యేడ్చుచుఁ జెప్పఁడు చెప్పుఁడు నా కుమారుఁడును అల్లుఁడును ఆదుష్టరాక్షసునికిఁ గబళములైరా అని అడిగిన వాండ్రు దేవా! మానోటితో దేవరకు దుష్టవార్త జెప్ప వలసివచ్చినది. ఆపాడు భూతము కిరీటములు ధరించిన యోధుల నందఱనుఁనేరిచదియ గొట్టి యిద్దరిద్దరిఁగలిపి కాళ్ళకులంకెలుగట్టి గుదిగా మెడమీఁద వేసికొని తీసికొని పోయినఁదట మనవారినిద్దరింజంపి యొకేలంకెవైచి మెడమీఁదవైచి తీసికొని పోయినట్లు చెప్పినారు మహాప్రభూ! అని గద్గదస్వరములతోఁ జెప్పి యేడువఁదొడంగిరి. నృపా లుండు నేలంబడి యొడలెఱుంగక కొట్టుకొనుచుండెను. మంత్రులు సేదదేర్చి యోదార్చుచు నంతఃపురంబుకుఁ బంపిరి.

అతండు భార్యపైఁబడి వాపోవ ధర్మరతి నిరతిశయ ధైర్యావలంబిమతియై