పుట:కాశీమజిలీకథలు -07.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుద్ధము కథ

271

ఆకథ విని విరతి యబ్బురపాటుతో అతనిమొగము చూడఁ దొడ౦గినది. భూత పత్నియు విస్మయమభినయించుచు సాధ్వీ! నీవుగాజు యనుకొనునది రత్నమైనది. నీవు విచారింపవలదు. నీవు మంచి సౌఖ్యమనుభవింతువని పలుకుచు వారిద్దరిని దన భర్త యొద్దకుఁ దీసికొనిపోయి యావృత్తాంతమంతయు నాభూతనాధునితోఁ జెప్పినది.

అనియెఱింగించి....యిట్లని చెప్పందొడంగెను.

139 వ మజిలీ కథ

యుద్ధముకథ

చక్రవర్తియగు సూర్యవర్మ దేవవర్మపై యుద్దముప్రకటించి తన అల్లుడగుఁ సురూపునిఁ గుమారు కుశునిఁ గొంత సైన్యముతోఁ దోడునంపుమని చంద్రగుప్తునకు యాజ్ఞాపత్రిక పంపినపిమ్మట జంద్రగుప్తుండును విధిలేక వారిద్దరిని జతురంగబలముతోఁ బంపి అనుదినము యుద్ధవార్తల దెలుపుటకు వేగులవారిని బెక్కండ్ర నియమించెను. వాండ్రు పోయివచ్చి రెండవదివసపు సంగరవిశేషము లిట్లు జెప్పందొడంగిరి.

మహారాజా! సూర్యవర్మ బలంబులు నాలుగక్షౌహిణీలు చేరినవి. అతిరధులు మహా రధలు మహావీరులు రణాంగణమంతయు నిండియుండిరి. విచిత్రవ్యూహంబులు బన్ని నొడలెఱుంగక యోధులా యోధన మెప్పుడెప్పుడని తొందరపడుచుండిరి.

దేవవర్మబలము అక్షౌహిణియైనలేదు. యోధులు సందడి యించుకయుఁ గాన రాదు. అట్లైనను వెనుదీయక స్వల్పబలముతోనే సూర్యవర్మతోఁ బోర సన్నద్ధుఁడైన దేవవర్మ ధైర్యసాహసాదులు నరనాధులు కొనియాడఁ దొడంగిరి. ఉభయ సేనలలోని రణభేరుల మహాద్వానంబులు భూనభోంతరాళంబులు బీటలుగావింపుచుండెను. శంఖ కాహళధ్వనులు యోధుల సింహనాదములతో మిళితములై బలములకేఁ జెవుడు గలి గించినవి.

సూర్యవర్మ యిప్పుడైన నీయల్లునిబట్టి యపరాధిగా నాయొద్దకుఁ బంపితివేని యుద్ధ మాపుజేయుదునని దేవవర్మయొద్దకు రాయబారము బంపెను అతండు తిర స్కరించి రాయబారి నవమానించి పంపెను.

దానం గోపించి చక్రవర్తి యుద్ధమునకు నాజ్ఞ యిచ్చినతోడనే వీరులార్చుచుఁ బేర్చిన క్రోధంబున నొక్కుమ్మడి శత్రుబలంబులపైఁ గలిసిరి. శత్రుబలంబును బురి కొనునలుకమెయిం గలియబడి మనసేనలపై వాడిశరంబులఁ బ్రయోగింపఁ దొడం గిరి ఉభయబలంబులకుఁ బెద్దయుద్ధము జరిగినది సముద్రమువోలె విజృంభించి క్రమంబునఁ బరబలంబుల వెనుకకు నెట్టుచుండెను.