పుట:కాశీమజిలీకథలు -07.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యెరుఁగనని చెప్పితివి ఇది కడు విపరీతము ఇటు పిలువుము అనుటయు విరతి సిగ్గభిన యించుచు దేవీ! ఇదివరకు నేను బలుకరించి యెరుఁగను. నన్నతఁడును బలుకరింప లేదు. ఇప్పుడేమని పిలుతును, అని సంశయకలితమతియై పలికిన అక్కలికింజూచి భూతపత్ని నవ్వుచు పద పద సిగ్గేల నేనుగూడ వత్తుననుటయు అతఁడు పండుకొని యున్న చెట్టుక్రిందకి నామె నామెందీసికొని పోయినది.

అంతకుమున్నె ఆతండులేచి ప్రక్కను విరతింగానక నలుమూలలు సూచుచు నింతలో వీరిద్దరు వచ్చుటజూచి దద్దరిల్లి అట్టేలేచి యోసరిల్లి యేమియుమాటాడక వింతగా భూతకాంతంజూచుచుండెను.

అప్పుడు విరతి దేవీ ! యితండే నేజెస్పిన యతండు చూడు మనవుఁడు భూత పత్ని దాపునకుఁబోయి చూచుచు నీవెవ్వఁడవు? నీవృత్తాంత మెయ్యది? నీదేకులము నిజము జెప్పుము చెప్పకున్న నిన్నుదండింతుము నిజముచెప్పిన గౌరవింతుము. ఇందు లకే నిన్నీ చిన్నది మాయొద్దకు దీసికొనివచ్చినది. అతండే భూతరాజు నేనతనిపత్నిని మేమిద్దరము ఆపర్వతశిఖరమున వసింతుము. ధర్మపత్నియగు విరతి మూలమున నీతో నింత మెల్ల గా మాట్లాడుచున్నదానను. లేకున్న నాభర్త నిన్నీపాటికి జీల్చి విడుచును నిజము చెప్పము. అని యడిగిన అతండు విస్మయ సాధ్వవిద్యస్తచిత్తుండై చీకాకు పడి నిజము చెప్పక తీరదని యిట్లు చెప్పదొడంగెను.

అని యెఱింగించి ... ఇట్లని చెప్పదొడంగెను.

138 వ మజిలీ.

సుగతునికథ

అమ్మా! నీవు నన్నడిగినంతనే నావృత్తాంతమంతయు స్ఫురించుచున్నది. వినుము శ్రీకంఠనగరంబున వజ్రదత్తుఁడను. రాజు గలఁడు. అతండు సంతాన శూన్యుండై పెద్దకాలము పరితపించుచుండెను. సామ్రాజ్యవై భవసంతోషంబు నణఁగ ద్రొక్కి సంతానరాహిత్య పరితాపంబభివృద్ధి నొందుచుండెను.

ఇట్లుండ నొకనాఁడవ్వీటికి అపరశివావతార మనందగు జంగమదేవర యొకం డరుదెంచి శివాలయములో వసించెను. భూతిరుద్రాక్ష మాలికా విరాజితగాత్రుండు శంఖ ఘంటికాధారుండునై యొప్పుచున్న అతవివేషము జూచినవారికి మహానుభావుండని తోచక మానదు. అతఁడు త్రికాలవేదియనియు రసమూలికా సిద్ధుండనియుఁ బౌరు లద్భుతముగాఁ జెప్పుకొనఁ దొడంగిరి.

ఆవాడుకవిని వజ్రదత్తుఁడొకనాఁ డయ్యోగికడకుఁబోయి స్తుతి పూర్వకముగాఁ దన యభిలాష నెరింగించెను. అయ్యోగి యానృపతి గృపావిలోకనములఁజూచుచు