పుట:కాశీమజిలీకథలు -07.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కాశీమజిలీకథలు - సప్తమభాగము

కేవలము విరక్తురాలనిన నేనొప్పుకొనను. మగఁడుతక్క నన్నిటియందు నాసక్తురాలే. దానికిఁ తెలియనిపనిలేదు గ్రంధములన్నియు నన్వయించును. పురాణ గాధలు జక్కగా బోధించును. ఒరులకుఁ బతివ్రతాధర్మములు జెప్పును. ఈపురుష ద్వేషత్వము మనప్రారబ్దము గాఁబోలునని చింతించిన నాబ్రాహ్మణుఁడు పోనిమ్ము దానినేమియుననవలదు. నాకది యారవప్రాణము. అని యుగ్గడించెను. ఆప్రథ గ్రామమ౦తయు వ్యాపించినది. సురసకుఁ బురుషవాంఛ లేదని యాఁడు వాండ్రం దఱు నిశ్చయపరచిరి.

ప్రవరుఁడు అత్తమామల యాదరము తలంచియు సురససౌందర్యము దలం చియు నాయూరు విడువనేరక యెప్పటికై నను దానికి బుద్ధి తిరుగునేమోయను నాసతో సురస వెనువెనుక దిఱుగుచుఁగాలక్షేపము చేయుచుండె.

అని యెఱింగించి.

135‌ వ మజిలీ

అల్పునికథ

అగ్నివర్మయొకనాఁడు తన వీధిచావడిలోఁ గూర్చుండి కొందరుశోత్రులు చుట్టు నుం బరివేష్టింప భారతము శాంతిపర్వము చదువుచు నర్థము చెప్పుచుండెను. అట్టి తరి బదియారేఁడుల ప్రాయముగలిగి సర్వావయవసుందరుండగు నొక యువకుండు ప్రచ్ఛన్నముగా భూసంచారము చేయుచున్న మదనుండో అన నొప్పుచు ధూళిదూ సరిత శరీరుండై నను నులినాంబరధరుడై నను దేజము తొలంగక అచ్చటికివచ్చి అం దొకచోటం గూర్చుండి శ్రద్ధాభక్తులతోఁ బురాణము వినుచుండెను. అందు,


శ్లో॥ గార్హస్థస్యచ థర్మస్య యోగథర్మస్యచోభయో?
     అదూరసంప్రస్థితయోః కింస్విచ్చేయః పితామహః॥

గృహస్థుని ధర్మమునకును యోగిధర్మమునకుఁ జాల వ్యత్యాసము గలిగి యున్నది. ఒండొంటికిఁ జాలదూరము. వానిలో మోక్షమునకు ముఖ్యమైన మార్గ మేది. పురుషుఁడు దేనినాచరించి శ్రేయస్సునుబొందునో చెప్పుమని ధర్మరాజు భీష్ము నడుగుటయు నతండిట్టు చెప్పెను.


శ్లో॥ ఉభౌ ధర్మౌ మహాభాగా వుభౌపరమ దుశ్చరౌ
     ఉభౌ మహాఫలౌతౌతు సద్భిరాచరితావుభౌః॥
     అత్రతేవర్తయిష్యామి ప్రామాణ్య ముభయోస్తయోః

ధర్మరాజా! గార్హస్థ్యము యోగధర్మముగూడఁ బరమోత్తమములైన ధర్మములు