పుట:కాశీమజిలీకథలు -07.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని కథ

21

తప్పక మీరు శాపఫలం బనుభవింపవలసినదే యని యుపన్యసించిన విని ధరుఁడు కన్నీరు గార్చుచు నారదున కిట్లనియె.

సీ. పరమదుర్భరగర్భ నరకవాసము పున
             ర్భవభేద మనుభవింపగ వలెనె
    మలమూత్రమిళిత శయ్యల దొర్లి దొర్లి బా
             ల్యదశఁ గుంద(గం దగునయ్య మాకు
    వాతపైత్యాది ప్రభూతరోగములు బా
             ధింపఁదాల్తుమె తుచ్చ దేహములను
    పితృమాతృజాయావిహిత వియోగక్లే శ
             మోరాంబునిధి మునుంగుదుమె యింక

గీ. మిక్కుటంబగు జర తలకెక్క. దేహ
    ధారణముజేసి మనియెడు వారమయ్య
    అక్కటా ? మమ్ము రాయిగానై నఁ జేయ
    కవనిఁ బుట్టఁగఁ దిట్టెనేమయ్య తపసి.

మునీంద్రా ! భూలోకవాసుల క్లేశములఁ దలంచికొనిన గుండెలు పగిలిపోవు చుండును. అట్టి జగమున మే మెట్లు పుట్టువారము. ఈ యిక్కట్టు దాటు తెరవెద్ది ? అయ్యో ! వసిష్ఠమహర్షి యెంత కఠినాత్ముడయ్యెను. మేము వేల్పులమని యించుకయు విచారింపక పోయెనే ? మా ప్రభాసుని మూలమున నింత మూడినది. అతండు భార్యాలోలుండై యిప్పనికిఁ బురికొల్పెను. తలంచికొన మా తప్పు ప్రత్యక్షముగాఁ గనంబడుచునే యున్నది. బ్రహ్మస్వహరణ మూరక పోవునా మహాత్మా ? ఇప్పుడు మేమేమి జేయఁదగినది. కర్తవ్య ముపదేశింపుము. మా కేమియుఁ దెలియకున్నదిఁ నీపాలఁ బడితిమని యమ్మునిపతి యడుగులఁ బడి. గోలగోలున నేడువ దొడంగెను.

నారదుం డతని లేవనెత్తి వసూత్తమా ! ఊరడిల్లుము. ఇందుప్రభాసుని యపరాధ మధికముగాఁ గనంబడుచున్నది. మహేంద్రాదులమ్ముని శాపము క్రమ్మరింప జాలరు. మీరిప్పుడు చని యా యరుంధతీ మనోహరుని పాదంబులంబడి ప్రార్దింపుఁడు. ఆ దయాహృదయుఁ డేదేని సదుపాయము చేయకమానడు. శాప ప్రతిగ్రహణకాలము సమీపించుచున్నది. పో పొండని యపదేశించి నారదుం డెందేనింబోయెను.

పిమ్మట వసువు లయ్యతివతి హాతోపదేశమునఁ గొంత శోకోపశమనము గావించుకొని యా క్షణము హోమధేనువుతోఁ గూడ వశిష్ఠమహర్షి యాశ్రమమున కరిగిరి. అని యెఱింగించి.