పుట:కాశీమజిలీకథలు -07.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30]

జంగమదేవరకథ

233

యిచ్చుటకు నిశ్చయించితిమి అని యేమేమో చెప్పఁబోయిన నలుకమెయిఁ జాలుఁజాలు నీకతంబున నీముప్పు వాటిల్లినది శౌర్యవంతుని సంబంధము దెచ్చినవాఁడవు నీవు వత్సుఁడు వట్టి నిర్భాగ్యుఁడట. దర్మరతి విరతిని వానికిచ్చుట కంగీకరించినదికాదు. ఇప్పుడు శౌర్యవంతుని రావలదని ప్రత్యుత్తరము వ్రాయుము.

అనుటయుఁ గుశుఁడు తండ్రీ ! యిట్లువ్రాసిన నతనికిఁ గోపము రాదా! వాఁడలి గిన మనము నిలువఁగలమా? వాని కుమారుఁడు క్రూరుఁడని చెప్పినవారు శత్రువులు వాఁడు శౌర్యముకలవాఁడు మంధుఁడుగాడు దానంజేసి తీవ్రచిత్తుఁడువలెఁ గనంబడు నని మందస్వరముతోఁజెప్పిన విని చంద్రగుప్తుండు పోపొమ్ము నీకపటమంతయుం దెలిసినది. పెద్దవాని దేశముల పాలుజేసితివి. విరతికి నీచుం దెచ్చితివి. తెలియక నీమా యలకుఁ జిక్కితినని పలుకుచు వానిమాటలు వినిపించుకొనక తాను జేయఁదలచుకొనిన పని యొరులకుం దెలియనీయక విచారముఖముతో నిజనివాసమునకు బోయెను.

అని యెఱింగించువఱకు వేళ అతిక్రమించుటయు మణిసిద్దుండు తదనంత రోదంతం బవ్వలిమజలీయం డిట్లు చెప్పందొడంగెను.

133 వ మజిలీ.

జంగమ దేవరకథ

తెల్లవారి యెనిమిది గడియలకు ముహూర్తముంచఁబడినది. నిరూపించిన వత్సున శౌర్యవంతుని రావలదని యుత్తరములు వ్రాసిరి. వారెవ్వరును రాలేదు. రతిం బరిగ్రహింప సుకుమారుఁడు మహావైభవముతో నూరేగుచున్నవాఁడు మంగళవాద్యము లచేఁ బట్టణమంతయుఁ బ్రతిధ్వనులలిచ్చుచున్నది. విరంతిగూడ బెండ్లి కూతుం జేసిరి. పురోహితులు వివాహవేదికలపైఁ బెండ్లి పీటలు రెండునువైచి మంగళ సంస్కారములు గావించుచున్నారు విరతికి వరుఁడెవ్వఁడో తెలియదు. విడిది యెరుకపడదు. ఊరేగింపు జాడఁ గన౦బడదు ఇది కడువింతగా నున్నదని పరిజనులు బంధువులు ఆప్తులు గుజ గుజలాడుచుండిరి. కొందరు అడుఁగబోయి, నృపతి ముఖవైలక్ష్యము గనిపెట్టి యూర కొనిరి. కొందరు తొందరయేల పెండ్లి వేళ చూడమాయని యుపేక్షించు చుండిరి.

అరుణోదయమైనది. దెసల జీకటులంతరించుచున్నవి. పక్షులు గూయుచున్నవి హజారమున కాలసూచకములగు భేరీథ్వనులుమ్రోగుచున్నవి. అట్టితరి జంద్రగుప్తుఁడు స్నానముజేసి నిత్యకృత్యములు దీర్చుకొని తురగారూఢుండై మంగళవాద్యములతో రత్నాలపల్లకీ దనవెనుక వచ్చునట్లు నియమించి యుత్తరగోపురము దెసకరిగెను.

ఎక్కడనుండియో క్రొత్త పెండ్లి వారు రాఁగలరని వారిం దోడితేర రాజరుగు చున్నాడని నిశ్చయించి తమ్మెవ్వరిం బిలువకున్కి శంకించుకొనుచుఁ గొందరు బంధు