27]
అపరాధవిచారణ కథ
209
రాజు - కొండపల్లిలో నేమిటికుంటివి?
మృగ - నాకది జన్మభూమి.
రాజు - నీతల్లి పేరు.
మృగ - నాకుఁదెలియదు సామి.
రాజు - ఇతరులు చెప్పగా వినలేదా.
మృగ - తలయొకమాటయుం జెప్పిరి సామి.
రాజు - తండ్రి గురుదత్తుఁడని చెప్పితివిగదా! తల్లి పేరుమాత్రమేమిటికిఁ దెలియదు.
మృగ - పద్మిని అని కొందఱు చెప్పిరి.
రాజు - (పీఠముపైఁ జేరబడి యొక్కింతతడవు ధ్యానించి మరల ధైర్య మంది) నీవీరత్నాంగి నెరుఁగుదువా?
మృగ - ఎరుఁగుదును.
రాజు - దానియింటిలోనున్న యొక పరిచారికం దీసి కొనిపోయితివఁ సత్య మేనా?
మృగ - లేదు. లేదు. అది వట్టిమాట చెప్పుచునున్నది.
రాజు - దాని యింటికిఁ బోయితివా?
మృగ - పోయితిని. అందున్న యామె కడునిల్లాలు సామి.
రాజు - ఎట్లు గ్రహించితివి.
మృగ - బోగమువాండ్రు కడు చెడ్డవారనియు వారింటికివచ్చుట తప్పనియు నాకుఁ జాల బోధించినదిసామి. మఱియు ననేక నీతులు బోధించినది. అప్పటి నుండియు నట్టిపనులు మానివేసితిని. నా వృత్తాంతము విని పేరు మార్చుకొమ్మని చెప్పినది. యుత్తరము (అనబోయి మానివేసెను.)
రాజు - ఉత్తరమేమి చెప్పుము. చెప్పుము. యదార్థము చెప్పిన దోషము లేదు.
మృగ - ఏమియో యుత్తరము వ్రాసియిచ్చినది.
రాజు - ఎవ్వరికిమ్మని.
మృగ - (సంశయింపుచు) మా బంధువులకే.
రాజు - బంధువులనగా నెవ్వరో సరిగా జెప్పుము.
మృగ - రామదుర్గనగరంబున నున్న కుముదాంగదునకు.
రాజు - చూపితివా?