పుట:కాశీమజిలీకథలు -07.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపరాధవిచారణ కథ

205

ఎన్ని యిడుములం బడితిమి. పదపద. అడవులలో దాగిన విడుతుమనుకొంటివా? అని అదలించుచు వానిం బంధించిరి. మృగదత్తుఁడు తెల్ల తెల్లపోయి చూచుచుండ గదాధరుఁ డించుక యాలోచించి యిది యెవ్వరియాజ్ఞ వీఁడేమిఅపరాధము జేసెనని అడిగిన వాండ్రు అది మాకుఁ దెలియదు. గజేంద్రవాహునుని యానతిని వీనింబట్టితిమి. మేముకాక పెక్కండ్రు రాజభటులు వీని నిమిత్తము తిరుగుచున్నారని చెప్పిరి.

అందలికారణము పలుతెరంగులఁ దలంచుచు గదాధరుఁడు, ఏమియైనను లెస్సయే మేముగూడవత్తుము. పదుఁడని పలుకుచు నతనివెంట నడువసాగెను. గొన్ని దినంబులకు నా రాజకింకరులు వారి నుదయార్కునివీటికిఁ దీసికొనిపోయి రాజు ముందర నిలువఁబెట్టిరి.

ఉదయార్కుఁడు వారిం జూచి, ఏమిరా? నీకతంబున మాకుబైవారివలనఁ జాల యవమానములు వచ్చుచున్నవి. మాచక్రవర్తి నిన్నుబంపుమని యిరువదిసారులు ఆజ్ఞా పత్రికలఁ బంపిరి. నీ జాడ యేమియు మాకుఁ దెలియదు. రత్నాంగి పైవారింబట్టికొని తనయపరాధము మాపికొనఁదలంచుచున్నది. నీవునుఁబోయి గట్టిగా వాదించి గెలుపు కొనిరమ్ము. పొమ్ము. నీ వెంట రాజపురుషులువత్తురు వెఱవకుమని బలికిన విని సంత సించుచు మృగదత్తుఁడు గదాధరునితో మనమక్కడికిపోయి వాదింపవలసి యున్నది. నీవు బుద్ధిమంతుడవు ఎట్లు చెప్పవలయునో యాలోచింపుమని పలికెను. గదా ధరుఁడును గ్రమ్మర నాకథయంతయును విని విమర్శించుచుండెను. రాజభటుల విచా రించు దివసమున వారిని విద్యానగరమునకుఁ దీసికొనిపోయిరి.

అని యెఱింగించి ... .... ... ....

130 వ మజిలీ

అపరాధవిచారణకథ

అయ్యో? అయ్యో? మృగదత్తా! మనరహస్యము వెల్లడియగునట్లున్నది. అన్నన్నా? విధిసంఘుటనము కడు విపరీతముగదా. రామదుర్గనగరమునుండి రాజ ప్రతినిధియంపిన యభియోగ మీదినమే విచారించునఁట అప్పుడే పిలుచుచున్నారు. గురుదత్తాయనియు గుముదాంగదా యనియు గదాధరా యనియు మూడేసిమారులు పిలుచుచున్నారు. ఇప్పుడు మన మేమిచేయవలయును కన్నములో దొరికిన దొంగ చెప్పినమాటల నెవ్వరైన నమ్ముదురా? మన మట్లే దొరకితిమి. ఇప్పుడేమి చేయఁదగినది? రాజభటులు పారిపోవనీయరు. నిన్నుఁ విడిచి మేము పోవఁజాలము. అని భయ మభిన యించుచుఁ బలికిన విని యతండులికిపడి ఆహా ? మనదినము లెంతచెడ్డవి. మనకన్న ముందుగా శనిచారమువచ్చి పీడించుచున్నది కదా. కానిమ్ము. ఏమిచేయుదుము. చంపినఁ