పుట:కాశీమజిలీకథలు -07.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగదత్తుని కథ

187



    ధర శరావము వార
    స్త్రీ రమ్యాధరము సంస్మరింతురె కులజుల్.

పుత్రా ! వేశ్యయన మన్మధాగ్నిసుమీ? రూపమను సమిధచే వృద్ధిబొందు చున్నది. కాముకులు తమ యౌవనములు ధనములు ఆ యగ్నియందు హోమము చేయుచుందురు గణికాసంగమము కడుదూష్యము. ఆయువుక్షీణించును. ద్రవ్యము నాశనమగును. రోగములు బలియును. కీర్తినశించును పురుషుఁ డప్పనియెన్నఁడును చేయరాదు. పట్టీ ! నీవుమిగుల బుద్దిమంతుడవు. వస్తువిచారముచేసిన నందేమియున్నది కాకున్నఁ జక్కనియువతిం బెండ్లి యాడి. పిల్లలగని సుఖింపరాదా ఈ వస్తువులకై యీరాత్రినిన్నుఁగారవించును, రేపువచ్చినఁదల్లిచేగెంటించును. వీండ్రకు దయాసత్య ములులేవు. మరియొకతివాసి తెచ్చిన మరల గౌరవించును. ఎన్ని తేఁగలవు? భార్య యైన నట్లుచేయునా? బాబూ ! ఇది దుర్వృత్తిసుమీ? యౌవనారంభమున నీవృత్తిగలిగిన మానిపింప బ్రహ్మశక్యముగాదు. వలదు. వలదు. దోషము అని బోధించిన విని యాకుమారుండు లేచివచ్చి యామెపాదంబులఁబడి నమస్కరింపుచు దల్లీ ! నీవు నాకు మంచిమాటలుచెప్పితివి. నీపలుకులు నాచెవులు సోకి యపరిమితానందము గలుగఁజేసినవి. ఇది మొదలీపాటిపనులకుఁ బూనితినేని దైవఘాతకుఁడని పిలువుము. నీవు జాల తెలిసినదానివలెనుంటివి. ఈబోగముది నీకేమికావలయును. ఇందుండియు నీ నీతి వచనంబులెట్టు చెప్పితివి? నీవృత్తాంతమెఱింగింపుమని అడిగిన నామె యిట్ల నియె.

పుత్రా ! నాకీ బోగముది యేమియుఁ జుట్టముకాదు. నేనొక పాపాత్మురాలను. నావృత్తాంతముతో నీకేమిపని? నేను నీకొకరహన్య ముపదేశించెద నెవ్వరికిందెలియ నీయకుము నీవుత్తమవంశ సంజాతుఁడవు. నీమాటవలన నీవు కిరాతకులమునఁ బుట్టనట్లు తెల్ల మగుచున్నదికదా? నిన్నుఁ గన్నతల్లి యేమైనదో తెలియదు. సమసియే యుండును. నిన్ను జూచిన నాకుఁజాలి గలుగుచున్నది వినుము. నీకొకయుత్తరము వ్రాసి‌ యిచ్చెదను. ఆజాబెవ్వరికింజూపకుము. తూరుపుదేశముననున్న రామదుర్గ మను నగరమునకుంబోయి అందు గుముదాంగదుఁడను వైశ్యుని యింటికిం జని వానికే యీకమ్మనిమ్ము ఇతరులకుఁ జూపినఁ బ్రమాదము సుమీ? ఆతఁడు లేకున్న భార్యకిమ్ము. నీసుకృతవీశేషమునవారు సజీవులైయున్నచో నిన్ను గన్నఁకుమారుని వలెఁ జూచి పోషించి వారి సొమ్మంతయు నీకీయగలరు. నీవు సుఖింపఁగలవు. అని చెప్పిన విని యా బాలుండు సంతసించుచు నిట్లనియె.

అమ్మా ! నీవే నాకు దల్లివి మాతల్లిని నేనెరుంగనుగద. నేను గొప్పవంశము